పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/315

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

తాలాంకనందినీపరిణయము


క.

అని బాష్పనిష్పతితలో
చన యగు సుభద్ర తనవిచారము దెలుపన్
విని రోషభీషణాకృతిఁ
గనలుచు హైడింబు డంతకప్రతినిధియై.

333


సీ.

మొదల కౌరవుల రాముఁడు మెచ్చె నన్నచో
        రవరవ రోషాగ్ని రవులుకొనియె
నాతి నయ్యభిమన్యునకు నీయఁ డన్నచో
        వేడిపొగ ల్మేన వెడలదొడఁగెఁ
దుది పాండుపుత్రుల దూషించె ననినచో
        కణుకునిప్పులు నోట గ్రక్కఁబడియెఁ
గన్య లక్ష్మణున కింక నొసంగు నన్నచో
        చటులాస్యనిర్గతజ్వాల లెసఁగె


తే.

నంతకంతకు నిశ్వాస మధిక మగుచుఁ
బ్రళయకాలకృతాంతుని బగిదిఁ గెఱలి
పటపటన పండ్లు గీఱి దర్పంబు సూపి
పలికె నిట్లని యతఁడు సుభద్రతోడ.

334


క.

ఏమేమీ బలభద్రుఁడు
నీమహి నొవ్వంగ బలికెనే హైడింబుం
డీమహిని యున్న దెఱుఁగడు
గామోలు కురుక్షితీశుగర్వబలమునన్.

335


సీ.

మత్కోపదావాగ్నిమహిమ విశ్వంబెల్ల
        దర్పించి భస్మం బొనర్పజాలు
మనతరమన్ముప్టిఘాతాశనిపాత
        కులగిరుల్ భిన్నమై కూల్పజాలు