పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/306

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

251


క.

తమి నభిమన్యుఁడు గరుడా
స్త్రము నభిమంత్రించి వేయుతథిని శతసహ
స్రములైన పన్నగాశన
సముదయ ముదయించె చిత్రసంకాశముగాన్.

283


క.

కొన్నింటి జించి పదహతిఁ
గొన్నిఁటి విదళించి తుండకులిశాగ్రమునం
గొన్నిఁటి జించి భుజంగాల్
ఛిన్నాభిన్న ములుగాఁగ జేసి మెఱసినన్.

284


క.

అది గనుఁగొని హైడింబుం
డదయమతిన్ రాక్షసాస్త్ర మరిబోసి భయా
స్పదసింహనాదముల పె
ల్లొదరుచు హుంకించి మించి యురువడి నేసెన్.

285


సీ.

ఆశస్త్ర మసురమాయామోహితం బౌట
        శరభసింహవ్యాఘ్రశల్యభుజగ
పరశుతోమరశరప్రాసఖడ్గస్థూల
        పాషాణముఖభయాస్పదము లెల్ల
గురియింపుచుంట గన్గొని సుభద్రసుతుండు
        తదుపసంహతచికిత్సానిరూఢి
తడవు యోచించి గంధర్వాస్త్ర మరిబోసి
        విధివిధాయకమున వ్రేయ నదియుఁ


తే.

బెక్కుగతులను ద్రిజగదాభీల మగుచుఁ
బ్రళయకాలానలజ్వాలబగిది దోప
మింటమంటను మంట లొక్కంట నంటి
దనుజమాయామయోద్ధతుల నణఁచె.

286


క.

పొరిపొరి బెబ్బులు లట్టుల
నిరువురబలములను దక్కువెక్కువ లేకన్