పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/126

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 71


క.

ద్వారములుగలుగు నెడ-పెడ
దారిని యేతెంచి భిత్తితాడనముల - వే
సారుచు నొకచోనైనం
ద్వారము గనలేక బేలతనమున దిరిగెన్.

304


చ.

మదిని చికాకుఁ జెందు కురుమండను గాంచి, వృకోదరుండు ద్రౌ
పదియును దక్కుభూపతులు ఫక్కున నవ్వఁగ బాండవాగ్రజుం
డది గని, గన్నుసన్నల నయంబున వారి నదల్ప లజ్జమై
నొదవ సుయోధనుండు కుపితోగ్రత హస్తిపురంబుఁ జేరియున్.

305


క.

మయమాయామోహసభా
లయమున నీరీతిఁ గళవళం బగుచు నిజా
లయమునను నిలిచి యతిని
ర్దయచేఁ దక్షణమె ప్రతికృతం బూహించెన్.

306


మ.

కపటద్యూతముగూర్చి, పాండవభుజాగర్వంబుఁ బోకార్చి, రా
జ్యపదభ్రష్టత జేందఁగా శకునిమాయల్ జేర్చి, నానామహా
విపినస్థానములందు దుర్ధశల నుర్వి న్సంచరింపంగ నే
నిపుడే సేయకయున్న మత్కురుకులాధీశత్వముం జెల్లునే.

307


క.

అని యిటుల దురాలోచన
లొనరించి సమవర్తి ను నొయ్యన కపటా
త్మనిరూఢి హస్తినాపురి
కనుకూలునివలెనె బిలువనంపిన నతఁడున్.

308