నాల్గవ ప్రకరణము.
341
లకు పట్టణములోని ప్రముఖులందఱునుదయచేసిరి. మొదటి రెండు దినముల యందును లక్ష్మీనరసింహముగారే యగ్రాసనాసీనులుగాఁజేయఁబడిరి. ఆ సభలలో స్త్రీ పునర్వివాహ వ్యాపారముయొక్క భూతవర్తమానస్థితులనుగూర్చి నేనిచ్చినయుపన్యాసమును, ఇతరులిచ్చినయుపన్యాసములును, చదువఁబడిన పిమ్మట క్రొత్తసామాజికులనుచేర్చుకొనుటయు, కార్యనిర్వాహకసంఘము నేర్పఱుచుటయు, కార్యదర్శియొక్క సాంవత్సరిక వృత్తనివేదనమును వినుటయు, సమాజవిధులనుకొన్నిటిని మార్చుటయు, తప్పవిశేషవిషయము లేవియు చర్చింపఁబడలేదు. మూఁడవనాటిసభముఖ్యమైనది. అందు లక్ష్మీనరసింహముగారితో సంబంధించిన యంశములు చర్చింపఁబడవలసియున్నందున దానికి పారసీ-శ్రీనివాసరావు పంతులుగా రగ్రాసనాసీనులుగాచేయఁబడిరి. ఆ సభ యందీక్రిందినిర్ధారణములు చేయఁబడినవి. -
Resolved,
"2. That the trustee Mr. A. L. Narasimham, be requested to associate with him two other trustees for the best administration of late Pida Ramakrishniah's Fund of Rs. 10,000. (కీర్తి శేషులయిన పైడా రామకృష్ణయ్యగారి పదివేలరూపాయల నిధియొక్క యుత్తమ కార్యనిర్వహణముకొఱకు తమతోఁగూడ మఱి యిద్దరు ధర్మకర్తలను జేర్చుకొనుటకు ధర్మకర్తయైన లక్ష్మీనరసింహముగారు కోరఁబడవలెను.)
3. That of the two trustees that are to be associated with him, one be elected by the ex-officio members from among themselves and the other be selected by the present trustee from among the members of the Widow Marriage Association, Rajahmundry, Whether ex-officio or not. (ఆయనతో చేర్చుకోఁబడ వలసిన యిద్దఱు ధర్మకర్తలలో నొకరు వివాహములు చేసికొన్న వారిచేత తమలోనుండి కోరుకొనఁబడవలెను: రెండవవాఁడు వివాహము చేసికొన్న