ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శంభురాజాది ప్రశస్తమండలికుల
             చెఱిచి యేలండె కాంచీపురంబు
సింధు మంగళము గాసిగఁజేసి కాళవ
             పతి నీయకొలుపఁడే పలచమునకు
రాయగండ గోపాలు నరాతిభయద
రాయపెండెర బిరుదాభిరాము నుభయ
రాయగండాంకు ఖండియరాతి తిక్క
ధరణివిభుఁ బోల రాజుల కరిదిగాదె.

175
'ధరణి' - హ్రస్వము.176
క.

భూరి శుభగుణోత్తరులగు
వారికి ధీరులకు ధరణివల్లభులకు వా
క్పారుష్యము జనునే మహ
దారుణమది విషముకంటె దహనముకంటెన్.

177
'ధరణి' - హ్రస్వము.178
ఇటువలె తెలుగు కావ్యములందు ('ధరణి' మొదలగు పదములు కవులు) హ్రస్వములని వ్రాసినారు. గీర్వాణ సమాసములు ఏ (భాషా)కావ్యమందు (నైన) నొకటే.179
అంబ, లక్ష్మి మొదలైనవి ఏకపదములు (తెలుగున హ్రస్వములుగా)నుండును.180
ఇదివరకు వ్రాసిన సంస్కృతాంధ్ర లక్ష్యములు అధర్వణాచార్యులువారు పుట్టక మునుపటివి. ప్రతాపరుద్రయశోభూషణాది సంస్కృతకావ్యములందును, కాశీఖండము మొదలైన తెలుగుకావ్యములందున నిటువలెనే హ్రస్వ, దీర్ఘములు (గల రూపములు) గలవు. గ్రంథవిస్తరమని వ్రాయలేదు. అధర్వణాచార్యుల వారి కారికల కన్నను ముందువారును, పిమ్మటివారును గూడా రచించిన హ్రస్వదీర్ఘ(ములుగల పద)ప్రయోగములు బహులములు గలవు. కావున నహోబల పండితులవారు వ్రాసిన గ్రంథము- అనగా, 'అధర్వణ వచనమేవ మానం' 'స్థితి నిర్వాహార్థం' అను రెండు సిద్ధాంతములు వ్యర్థములు. హ్రస్వదీర్ఘములు ఇకారాంత, ఈకారాంతములే కావు. అకారాంత, ఆకారాంతములును గలవు. కొన్ని కొన్ని వివరించుతాము.181