ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చ. | నలినసరస్సుగంధి యమునా నది తుంగతరంగ సంతతా | |
ఇతిపాఠస్య బహుపుస్తకేషు దర్శనాత్. 'రాకసుధాంశు మండలము' ఇత్యత్ర రాకాపదం షష్ఠ్యంతమ్, సప్త మ్యంతం వా భవతి.
క. | నెలకొనియె వేటతమి న | |
ఇత్యాది ప్రయోగేతు తమసాది శబ్దానాం భిన్న పదత్వేనైన సాధుత్వ మవగంతవ్యమ్. అని వ్రాసినారు. (క. శి. భూ. ప్ర. 844.847)108
అధర్వణాచార్యుల వారియందు నుండెడు తాత్పర్యాతిశయము వలన నిటు లింత ప్రయాసము నొందుటే, కాని ఆకారిక కర్థ మదియుగాదు, ఈ నిర్ణయించినది సిద్ధాంతమున్నుగాదు. 109
ఈ సూత్రమునకే బాలసరస్వతులవారు —
'దీర్ఘాణాం = దీర్ఘములకు, హ్రస్వస్స్యాత్ = తెలుగున హ్రస్వము గలదు. అంబ, లక్ష్మి, కరుభోరు, దేశ్యపదే = దేశీయపు తెలుగునందు, న చ = లేదున్ను. నవలా, నేజా, లకోరి— ఇత్యాది. ఏకవర్ణేపి = ఏకాక్షర తత్సమమందున్ను, న = లేదు. క్ష్మా, శ్రీ, భ్రూ.'
అని వ్రాసినారు. ఇది రాజమార్గం. 110
అహోబల పండితులవారి వ్యాఖ్యలో 'అత్రేయం చింతా' అని వ్రాసినది మొదలుకొని చింతించవలసినదౌను. అధర్వణ కారికవలననే ఈకారాంతము లికారాంతములైతే, చంచూ, తనూ మొదలైన శబ్దములు హ్రస్వము లెటుల నాయెనో? చామరా-చామరం, వ్రీడా- వ్రీడః ఈ మొదలైన శబ్దము లెటుల హస్వము లాయెనో తెలియదు. అయితే అధర్వణాచార్యుల వారికి నన్నయభట్టుగారికి, కాళిదాసాదులకు పూర్వులైన శ్రీ హర్షులవారు ద్విరూపకోశమందు.