ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

నలినసరస్సుగంధి యమునా నది తుంగతరంగ సంతతా
నిల శిశిర స్థలాంతర వినిర్మత నిర్మలహర్మ్యరేఖలన్’

ఇతిపాఠస్య బహుపుస్తకేషు దర్శనాత్. 'రాకసుధాంశు మండలము' ఇత్యత్ర రాకాపదం షష్ఠ్యంతమ్, సప్త మ్యంతం వా భవతి.
క.

నెలకొనియె వేటతమి న
బ్బలియుఁడు శిశిరనగరుచిరపరిసరమహిమం
గల తమసవీరసికతా
విలసనములు డెందమునకు విందొనరింపన్.

ఇత్యాది ప్రయోగేతు తమసాది శబ్దానాం భిన్న పదత్వేనైన సాధుత్వ మవగంతవ్యమ్. అని వ్రాసినారు. (క. శి. భూ. ప్ర. 844.847)108
అధర్వణాచార్యుల వారియందు నుండెడు తాత్పర్యాతిశయము వలన నిటు లింత ప్రయాసము నొందుటే, కాని ఆకారిక కర్థ మదియుగాదు, ఈ నిర్ణయించినది సిద్ధాంతమున్నుగాదు. 109
ఈ సూత్రమునకే బాలసరస్వతులవారు
'దీర్ఘాణాం = దీర్ఘములకు, హ్రస్వస్స్యాత్ = తెలుగున హ్రస్వము గలదు. అంబ, లక్ష్మి, కరుభోరు, దేశ్యపదే = దేశీయపు తెలుగునందు, న చ = లేదున్ను. నవలా, నేజా, లకోరి— ఇత్యాది. ఏకవర్ణేపి = ఏకాక్షర తత్సమమందున్ను, న = లేదు. క్ష్మా, శ్రీ, భ్రూ.'
అని వ్రాసినారు. ఇది రాజమార్గం. 110
అహోబల పండితులవారి వ్యాఖ్యలో 'అత్రేయం చింతా' అని వ్రాసినది మొదలుకొని చింతించవలసినదౌను. అధర్వణ కారికవలననే ఈకారాంతము లికారాంతములైతే, చంచూ, తనూ మొదలైన శబ్దములు హ్రస్వము లెటుల నాయెనో? చామరా-చామరం, వ్రీడా- వ్రీడః ఈ మొదలైన శబ్దము లెటుల హస్వము లాయెనో తెలియదు. అయితే అధర్వణాచార్యుల వారికి నన్నయభట్టుగారికి, కాళిదాసాదులకు పూర్వులైన శ్రీ హర్షులవారు ద్విరూపకోశమందు.