ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కున్నారు. అప్పకవిగారు– 'భీతి నేగుచో' అనియున్నందున భీతికాకుస్వరముకు లక్ష్యము వ్రాసినారు. 'ఓజనులార, సురలార, అడ్డపడరో' అని పిలుచుటే ముఖ్యమని మాతాత్పర్యము. కుశాగ్రబుద్ధి (గల) సుకవి రాజశేఖరులు ఏది గ్రాహ్యమో దాని గ్రహించవలయును. 464
అందే (అరణ్య. 111)
శా.

అన్నా లక్ష్మణ నిన్నుఁ బుణ్యనిధి నే నజ్ఞానినై వల్కితిన్
నన్నా పాపము వచ్చిచుట్టుకొనియెన్ నా పాలి దైవంబవై
యిన్నీచుం బరిమార్ప వేగఁ బరతేవే నన్ను రక్షింపు మీ
యన్నం గ్రక్కున జీరవే యరుగవే యత్యుగ్ర శీఘ్రంబుగన్.

465
'వేగఁబరతేవే' అనుచోట. 466
ఇది అప్పకవిగారు శోకప్లుత మన్నారు. దూరాహ్వానమని మాతాత్పర్యము.467
శ్రీనాథుని కాశీఖండము (7-161)
ఉ.

వేదపురాణశాస్త్రపదవిన్ నదవీయసియైన పెద్దము
త్తైదువ హాటకపీఠ శిఖాధిరూఢ య
య్యాదిమశక్తి సంయమివరా యిటు రమ్మని పిల్చె హస్తసం
జ్ఞాదరనీలరత్నకటకాభరణంబులు ఘల్లుఘల్లురన్.

468
వసుచరిత్రము (2-141)
ఉ.

ఓ వసుధాతలేంద్ర కరుణోదధి యీ తడవేల ప్రోవరా
వే వసుభూప యంచు నెలుగెత్తి వెస న్మొఱవెట్టు చాడ్పునన్
(శైవలినీరవం బెసఁగె శైవలినీనినదంబు కన్న ము
న్నావిలభూరి వారి విహగారవగౌరవ మెచ్చె నెల్లెడన్).

469
కళాపూర్ణోదయము (4–116)
మ.

అకటా యేమని దూఱుదాన నిను నాథా వేఁగు జామయ్యె (బొం
దికఁగాఁ బాదములొత్త రమ్మనుట గానీ యొంటియేమో కదా
నికటక్షోణికి నేగుదెమ్మనుట గానీ కొంత నెయ్యంపుఁ బూ
నికతోఁగన్నులు విచ్చిచూచుటయ కానీ లేద యొక్కింతయున్).

470