ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీనాథుని కాశీఖండము (7-60)
సీ.

సితికంధరునకు నెచ్చెలికాఁడు గాఁడొకో
             యటమటీఁడైన యీ యక్షభర్త
అహికంకణునకు మూఁడవకన్ను గాఁడొకో
             ప్రాల్మాలు నట్టి యీ పావకుండు
పురవైరి కవతంసపుష్పంబు గాఁడొకో
             నిర్భాగ్యుఁడైన యీ నీరజారి
గంగాధరునకు లెంకలలెంక గాఁడొకో
             పెనుగూళి యైన యీ యనిమిషేంద్రుఁ
డేమి కుడువంగ వచ్చినా రిళ్లు వదలి
హరుని వెలివెట్టినట్టి యీ యాగమునకు
పంచవదనుని కను జేవురించెనేని
తత్క్షణమునంద తమయాండ్ర త్రాళ్లు తెగవె.

27
సభాపర్వము (1-47)
సీ.

ఈయంబునందు నాలవభాగ మొండె మూ
             డవభాగ మొండె నం దర్ధ మొండె
గాని మిక్కిలి సేయఁగాదు వ్యయం బని
             యవధరించితె బుద్ధి యవనినాథ
ఆయుధాగారధనాధ్యక్షములయందు
             వరవాణి వారణావలులయందు
బండారములయందు పరమవిశ్వాసులు
             భక్తుల దక్షులఁ బంచితయ్య
గురుల వృద్ధశిల్పి వరవణిగ్బాంధవ
జనుల నాశ్రితులను సాధుజనుల
గరుణఁ బేదఱికము బొరయకుండఁగఁ బ్రోతె
సకలజనులు నిన్ను సంస్తుతింప.

28
పై పద్యములందు మూడవ, నాల్గవ- రెండు పదములున్నవి 'రెండవ' పదముకు౼