ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ్యాలాంగనయో కాకీ
భూలోకస్త్రీల కిట్టి పొంకము గలదే.

22
అచ్చుకు
మనుచరిత్రము (2-41)
ఉ.

ఇంతలు కన్ను లుండఁ దెరువెవ్వరి వేఁడెదు భూసురేంద్ర! యే
కాంతమునందు నున్న జవరాండ్ర, నెపంబిడి పల్కరించు లా
గింతయ కాక, నీ వెఱుఁగవే మును వచ్చిన త్రోవచొప్పు? నీ
కింత భయంబు లే కడుగ నెల్లిద మైతిమె! మాట లేటికిన్‌?

23
లాక్షణికులందఱు 'ఏకాంత' పదమును ప్రధానముచేసి నిత్య సమాసయతికి లక్ష్యము వ్రాసినారు. అప్పకవిగారు రాగమసంధిని ప్రధానము చేసినారు. రెండు ననవచ్చును. కాని మూడవచరణమందు నేయతియో యెవరును వ్రాయలేదు. 24

2. విభాగయతి

లక్షణము
గీ.

అవ యనంగ నేసి యన నొప్పు పదములు
సంధులందు రెండు జరుగుచుండు
సంఖ్యయును బ్రమలు సంజ్ఞయుఁ గలచోట
నగు విభాగయతులు నగనివేశ!

25
అర్థము :- రెండవ, మూడవ ఈ మొదలైన పనములందు 'వ' అను(దానిలోని ఆది) స్వరము కలుసుకొని ఉన్నందున, డకారముకు అ య హ లు చెల్లును. ట ఠ డ ఢ లు చెల్లుట స్పష్టమే. (ఇక) పడేసి, పట్టెడేసి, దోసెడేసి- మొదలైన పదముందు 'ఏసి' అను దానితో సంధిగలదు గాన, ఉభయము చెల్లును.26
లక్ష్యములు
'మూడవ' అచ్చుకు