ఈ పుట అచ్చుదిద్దబడ్డది
లక్ష్యములు: ఆదిపర్వము (1–77)
ఉ.

ఇమ్ముగ సర్వలోకజను లెవ్వనియేని ముఖామృతాశుబిం
బమ్మున నుద్భవంబయిన భారతవాగమృతంబు కర్ణరం
ధమ్మను నంజలిం ధవిలి ద్రావుదు రట్టిమునీంద్రలోకవం
ద్యుం బరముం బరాశరసుతుం బ్రణమిల్లి కరంబు భక్తితోన్.

239
పినవీరభద్రుని జైమినీభారతము (7-145)
ఉ.

అమ్మఖవాజి పాండుతనయాధ్వరవాహ మెదిర్చి మోముమో
వం బసివెట్టి ఘోషితరవంబున (వక్షముఁ బూర్వపత్ఖురా
గ్రంబున వ్రేయఱేసి మది కందము వట్టి విదల్పఁబో నమి
త్రంబయి కేలికిం గడఁగి దంతములన్ గళ మప్పళింపఁగన్.)

240
ఇది ప్రాసమైత్రి ప్రాస మంటారు.

(అయితే) కాకునూరి అప్పకవిగారి "ఆంధ్రశబ్దచింతామణి"

(3-343) యందు 241
గీ.

గట్టి బిందువుమీది బకారమునకు
జమిలి మా ప్రాసమైత్రినాఁ బరగుచుండు
కమ్మతావులు వెదజల్లు నంబుజములు
శంబరారాతి చేతివాలమ్ము లనఁగ.

242
(కాని) లక్షణసారసంగ్రహమందు (2-78)
గీ.

బమలు బిందుపూర్వకముగ, బ్రాసంబుల
నిలుపఁజెల్లు, ల ళల కిల నభేద
మొదవుచుండుఁ గృతుల నుడురాజకోటీర
దురితదూర! పీఠపురవిహార!

243

—అని తిమ్మకవి సార్వభౌముడుగారు చెప్పినారు. కావున బిందువు లేకపోతే
జమిలి మా లేదు. కంమ్మ, ఇంమ్మ, అంమ్ము —ఈ మొదలైనవి బిందు
పులు గలవని తెలియవలయును.244