ఈ పుట అచ్చుదిద్దబడ్డది

       అహోబల పండితులవారు ఉయ్యల, పయ్యదకు ఆధర్వణ కారికే ప్రధా
నము చేసి యకారములకు ఏత్వము లేదన్నారు. కాని తలకట్టుగలదని పరి
శీలించినారు కారు. అప్పకవిగారికి నన్నయభట్టు గారి కారికలు ప్రధానము.
ఆహోబల పండితులవారికి నన్నయభట్టుగారివి, అథర్వణాచార్యుల వారివి
రెండును ప్రధానము. "డోలా భూషోత్తరీయాణి" అను అథర్వణాచార్యులవారి
కారిక నెఱింగితే, ఆ కారికను తెలిగించిన ముద్దరాజు రామన్నగారి నప్పకవిగా
రాక్షేపించరు. అంత కష్టపడి లేని పదద్వయ విభాగమును చెయ్యరు.166
       ఇంచుకంత సంస్కృత మందు నించుకంత యాంధ్ర మందు తెలిసీ
తెలియని పండితంమన్యులు నన్నయ భట్టుగారి సూత్రముల ననుసరించిన
ప్రయోగములే సాధువులుగాని, సూత్రముల ననుసరించనివి అసాధువు
లంటారు.167
       పదాది యకారము లేదాయెను. పదాది వకారముకు వోఢ్ర శబ్దమందు
నోత్వ ముండెను. పూంచెన్-దీర్ఘమందు పూర్ణబిందు వుండెను. 36 వర్ణ
ములే కాకుండగా మఱియును గలిగి యుండెను.168
       ఇటువలెనే సూత్ర మొకరీతినుంటే, మహాకవి ప్రయోగము లొకరీతి
నున్నవి బహుళములు గలవు. ముందు ప్రసక్తమైనచోట వ్రాసుతాము.169
       ఆంధ్ర వ్యాకరణ మందేకాదు, పాణినీయ వ్యాకరణమందును కొన్ని
సూత్రములు ప్రవర్తించవు. అంత మాత్రమున వారి మహత్వమునకు లోపము
రాదు.170
       సంస్కృతాంధ్ర వర్ణనిర్ణయము సేయుటకునై యిదివరకే గ్రంథవిస్తర
మైనందున (ఇక) ప్రాస నిర్ణయమును చేయుచున్నాము.171

ప్రాసములు

1. ఉభయప్రాసము

గీ.

శసలు నొకదాని కొకటి బొల్పెసఁగు, నటుల
నణలు రెండుఁ బ్రాసంబులై దనరుచుండు
సత్కవీశ్వర కావ్యాలిఁ జంద్రమౌళి
పృథు దయాపాంగ! శ్రీ కుక్కుటేశ లింగ!

172