చతుర్థాధ్యాయము
69
సత్యుఁడు, దుర్మద నై రివీరభయంకరుఁడు, బసవశంకరుఁడు, అనునవి
ముఖ్యములై నవిగా నున్నవి. ఇతనికిఁ గాశ్యపగోత్రసంజాతుడుకు, రాజు
తంత్రజ్ఞుఁడును సమర్దుడును, అనూత్యశిఖామణియు, శాస్త్రవిదుఁడు,
వయోవృద్ధునగు రామా ప్రెగ్గెడయను నియోగి బాహ్మణుఁడు మంత్రి
గనుండెను. ఇతనికిఁ దమ్ములైన అన్నా రెడ్డియు, మల్లా రెడ్డియు కుమా
కుఁడైన అనపోత రెడ్డియు, మాతులపుత్తు డైన నూకారెడ్డి యుఁ బ్రసిద్ధ
సేనానులుగ నుండి 'వేమా రెడ్డికి దిగ్వజయ మొనర్చుచుండిరి. వీరిలో
మల్లా రెడ్డి శ్రీ రామచంద్రునికి లక్ముణునివలెను, ధర్మజునకునర్జునునివలె
నువేనూ రెడ్డికి విధేయుఁడై సౌభ్రాతృత్వము పుచుసమస్త జనులచే
గొనియాడఁ బడుచుండెను. మల్లా రెడ్డి తురుష్కులను జయించి వారాక్ర
మించిన బాహ్మణాగ్రహారములను మరళ బ్రాహ్మణుల కిప్పించెనట.
ఇతఁడు కాకతీయ సైన్యాధిపతులగు క్షత్రియులను జయించి మోటుప
ల్లిని స్వాధీనపటి చికొనియెను. అనపో త రెడ్డి సేనాధ్యక్షుఁడై ధరణికోటయం
దుండి పద్మనాయుకుల వలనను, రాచవామవలనను తమ రాజ్యమునకు
హానికలుగకుండ గాపాడుచుండెను. ఇట్టి సేనాపతుల సాహాయ్యముతో
బర రాజులను జయించి యీవేమాభూ పాలుఁడు కందుకూరి మొదలుకొని
గోదావరీనది పర్యంతముగల యాంధ్ర దేశమును బరిపాలించెను.
బ్రహ్మకండి కృష్ణ వేణి గోదావరీ మహానదీతటధ్వయు తన్మథ్య దేశం.
నేకాగ్రహారం' అను విశేష మొకటి వేమునకుఁ, గలదని శాసనములలో
గన్పట్టుచున్నందున వేముఁడు నెల్లూరు మొదలు కటకము,దాక పరిపా
లనము చేసినట్లు తోఁచుసనియు, ఇందులోఁ గొంతభాగ మతిశ యోక్తి
కింద, గొట్టి వేసిన ప్రస్తుతపు గోదావరీ మండలములోఁ జేరిన దేశమం
తయు నతనిపరిపాలనకు లోఁబడినదన్నటకు సందేహముండదనియు
శ్రీ జయంతిరామయ్య గారు ప్రాయుచున్నారు గాని యదియంతగా
బాటింప పదగినది కాదు. పై దానిలోఁ గటకము ప్రశంస గాన రాదు. *[1] అంతియ
- ↑ * ఆంధ్ర భారతి సంపుట 2 సంఖ్య 3 పేజీ 116 చూడుఁడు.