ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథకవి


ఘనుఁడు నగరీశ చంద్ర శేఖర పదాబ్జ
వందనానందితాత్ముండు వంశకరుడు.

అని హరవిలాసమున సింహవిక్రమ పట్టణ (నెల్లూరు, శ్రేష్ఠుఁడుగా వర్ణింపఁబడి యుండుట చేతను,

క, కొమరగిరి వసంతనృపా
గమక వివరగంధసార కస్టూరీ కుం
కుమ కర్పూరహిమాంభ
ముదంచిత బహుసుగంధరాలాధ్యక్షా.

అని తిప్పయ సెట్టి కుమారగిరి నిమిత్తము 'దెప్పించిన కర్పూరమును, గఁథసారమును, కస్తూరిని విక్రయించు గొప్ప సుగంధ ద్రవ్యముల వాణిజ్య శాలను "బెట్టినవాడా యని సంబోధింపఁబడి యుండుటచేతను, ఆనాటికి తిప్పయ సెట్టి నిజముగా గొండి వీటి పుర శాసియని నమ్మి, విద్యానగరాధి పతియగు రెండవహరిహర రాయలు, బహుమనీ సుల్తానగు ఫిరోజ్ షాహ, కుమారగిరి రెడ్డి, మూవురు బ్రతికిఁయున్న కాలమున క్రీ. శ. 1400 సంవత్సర ప్రాంతమున కుమారగిరి ప్రభుత్వపు జివరభాగమున, అనఁగా 1398 లో గాని, 1399 లోఁ గాని రచింపఁబడి యుండునని విశ్వసించి, సులువుగాఁ దెలిసికొనఁదగిన దానికి లేనిపోని కల్పనలను గావించి శ్రీనాథుని జీవిత కాలనిర్ణ యమునకుఁ బ్రతిబంధకమగు గొప్ప చిక్కును గలిగించిరి. ఈచిక్కును దొలగించునట్టి విషయము మనము సరిగా హరవిలాసమును బరిశీలించి విమర్శదృష్టితోఁ బఠించినయెడల మనకే దృష్టి గోచరము కాగలదు. శ్రీనాథుఁడు తన హరవిలాసమున ::

ఉ. మంకణమానివంశ మణిచందన కాంచీ పురనివాస! యే
ణాంక కిరీట దిశ్యచరణాంబుజ సేవక ! వైరిభధ్ర నా
గాకుళ! హారిహరదర హాసవి పాండువ కీర్తి చంద్రికా
లంకృత దిగ్విభాగ ! శుభలక్ష్ముణ! చారిరుహాయ తేక్షణా!

అని తిప్పయ సెట్టిని కాంచీపురీనివాస యని సంబోధించుచున్నాఁడు. దీనిఁ బట్టి తిప్పయ పెట్టి కాంచీపురనివాసియై యున్న కాలముననే హర