ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

శ్రీనాథ కవి


శ్లో.శ్రీమానిమ్మడిదేవరాయకతీచుల్లసూక్త విగో నిక్వజ్ఞాపితం కల్లోలప్రతిమల్లమూర్తి విభవ కాంచి వస్తునకు సాన్మహా నాటక 'కాపు సజ్జ -స్ మ్యాన కాస్ట్ డ్వెభుః

ఈశ్లోకమునఁగల 'కల్లోల ప్రతిమల్ల సూక్తివిభవి' యను పద్య మేథీనముకు లేక యల్లే డిండిమభట్టారకుని చాటుపద్యమునఁ గూడఁ గలదు. ఉదాహరింతును;--

శ్లో. ఆ డికీ మనం తత ఇతో.. ది షణు

" శ్చిత్ర పటాయతీ రుచ ప్రోని పద్యానిన ,

ఆసాంతాన దినం మహేశమము కో ! 75 kE.. నీ కల్లోల ఫలిచుల్లసగా ! . నచ్చే ప్యాన్ని జీష్యా ను హే.

దీనివలన నిమ్మడి దేవరాయల కాలమున డిండిమభట్టారకుఁడుండి నట్లు తేలుచున్నది. మఱియు, మహానాటక సుధానిధి కూడ నాడిండిమ భట్టారకుని కూర్చే యగునో యనిసందియము పొడముచున్నది. దేవరాయలు రచించినట్లుగ రతిరత్న ప్రదీపిక యను కామశాస్త్రము గూడ నిట్టి దేయగుఁగాబోలు! అయియుండును. అన్యకవీశ్వర రచితము లై ధనలోభమున రాజుల పేళ్ళఁ బ్రచురించబడిన గంథములు మన తెల్గు దేశముననే పరశ్శతము గలపు. ఆ కుళ్ళు నెల్లడింప వేఱ గ్రంథ మే కూర్చవలసి యున్నది. ఈప్రౌఢ దేవరాయలవారి కాలముననే అరుణ గిరినాముఁడను కవీశ్వరునిచే ద్రావిడ భౌషయందుఁ గొన్ని ప్రాథములగు శైవస్తోత గ్రంథములు రచియింపఁబడినవి. ఆరుణగిరినాముఁడీ యోగా నంద ప్రహసనకర్త యగునేమో విచారింపవలసియున్నది.

శ్రీనాథుఁడుద్భటవివాదముఁ బెట్టుకొని జయించినది రెండవడిండి మకవిసోర్వభౌముని. ఈడిండిమక విసార్వభౌముని మాతామహుఁడగు డిండిమక విసార్వభౌముఁడు (ప్రథముఁడు) కవితార్కిక సింహసర్వతంత స్వతం తాది బిరుద మండనుఁడై విశిష్టాద్వైతమతమును బెంపొందించిన వేదాంత దేశికునితడుటవివాదము జరిగించినట్లొక గాధ పండిత