ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీ వేంకటేశ్వర ప్రభాత స్తవము
86
జనులకెల్ల మహాప్రసాదంబు లొనరఁ
గోరినవారికిఁ గోర్కు లీడేర,
నీరీతి జగముల నేలుచునుండు
నని భక్తిఁ దాళ్లపా కాస్నమాచార్యు
తనయుండు తిమ్మయ తగఁ బ్రస్తుతించె.
శ్రీ వేంకటేశ్వర వచనముల ముద్రణము సాగుచుండఁగా, రాజ కీయ ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో నీ ప్రభాత స్తవమును గుర్తించి యేక కవి కృతియని, యిందు దీనిని గూడఁ బ్రకటించితిని.
వే. ప్ర.