పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/385

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తొ £ ప ట ఠ a తండియానతి జవదాటక పాలించుటచేఁ జక్రవర్తి య్య ను. గుప ముగా నిందొక్క ధర్మసూక్ష్మ మీమీడియున్నది. యయాతీ కిర్వురు భార్యలు. పెద్ద భార్య దేవయాని. ఈమె రాక్షసగురువగు శుక్రాచార్యుని తనూజ; యయాతి చంద్రవంశ క్షత్రియుఁడు. శుక్రాచార్యుఁడు బ్రాహ్మ ణుఁడు. కావున యయాతి దేవయానుల యుద్వాహము ప్రతిలోమ వివాహమగును. ప్రతిలోమ వివాహమున సంకర్ణుల పుట్టుదురని సమ్మతి క ర్తలు ఘంటాపథముగ వచించుచున్నారు. కావున క్షత్రీయ పురుషున కును బ్రాహ్మణ స్త్రీకిని బుట్టినవాఁ డెవఁడై యుండును ? “బ్రాహ్య మ్ క్షత్రియాత్పూత?” అనఁగా బ్రాహ్మణ స్త్రీకివి క్షత్రియునకుపు బుట్టినవాఁడు సూతుఁడగును. సూతునకు రాజ్యాధికారము లేదు. అందుచేతనే యాదు వునకు యౌవరాజ్య పట్టాభి షేకముగాని, పట్టాభిషేకముగావి జరిగి యుండలేదు. ఇక యయాతి రెండవ భార్యయగు శర్మిష్ణనుగూర్చి విచారిం తము. ఈమె దానవేంద్రుఁడగు వృషపర్వుని కూతురు. ద్రావిడ జన పాలురను భారత కాలమునాఁడు క్షత్రియులుగనే యార్యులు చూడ మొదలిడిరి. అందుచేతనే యయాతి శర్మిష్ణా వివాహము సవర్ణవివాహ మయినది. ఇది కారణముగ శరీషా సుతుండయిన పూరుఁడు యయాతి యనంతరము చక్రవర్తీ య్య ను. ఈ పురుఁడే కౌరవ పాండవులకు మూలపురుషుఁడు. యదువు యదువృష్టి, భోజాంధకాది జాతులకు మూలపురుషుఁడు. యాదవులఁ గూర్చీ భాగవత “మేమీ చెప్పు చున్నదో చూతము: ద్వాదశస్కంధములో భవిష్యన్నరపాల రాజ్య వరిపాలన కాలనిర్ణయాను వర్ణనములో నీ క్రింది వాక్యములు చేప్పఁ బడెను. “పురంజయుండు మగధదేశాధిపతియై పుష్టి. ఆతనతండు పుళింద యదు మద్ర దేశవాసులగు హీనజాతి జనులు బ్రహ్మ జ్ఞాన విహీ నులై పరిభ క్తి ఏరహితులై యుండువారీకి”.ఈ మాటలను బరీశీలించి చూచినయెడల యాదవులు, పుళిందులతో సాటివారుగాఁ గన్పట్టుదురు. పుళిందు లెవరు? “భేదాఃకిరాత, శబర పుళిందా ప్లేచ్చజాతయః" అని అమరుఁడు - కండో క్లిగా. వచియించుచున్నాడు. కనుక యాదవులు