ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

పంచమాశ్వాసము


వ.

అని గౌతమవరుండు చెప్పిన పుణ్యతీర్థప్రభావంబున కలరుచుఁ బరమతత్త్వ
వివేకి యగు వాల్మీకి యచటుఁ గదలి భరద్వాజసహితుండై మహితతపో
విరాజమానమునిసమాజపూజితంబును, బ్రసిద్ధసిద్ధచారణగీర్వాణసేవి
తంబును, సకలకాలకుసుమఫలభరితతరులతాపరివృతంబును, గ్రోశమండల
విస్తారంబును, నగు బిల్వతీర్థంబునకుం జనియె నని చెప్పి యప్పారాశర్య
వర్యుండు వెండియు నిట్లనియె.

55


సీ.

ఇంద్రు డేతరువె ము న్నెలమి నారాధించి
సురరాజ్యవైభవస్ఫురణఁ దనరె,
మైత్రేయినాఁగ బ్రాహ్మణి యేమహీజంబు
సేవించి యోగసంసిద్ధి నొందె,
వాలఖిల్యాదు లేవరపాదపచ్ఛాయ
నెల్లకాలము నాశ్రయించి యుందు,
రజనిర్మితంబైన యాగవేదిక నేఁడు
నేశాఖి క్రేవ నొప్పెసఁగి వెలయు,


తే.

విబుధమానవదైతేయవితతిలోన,
నెవ్వ రెవ్వరి కెట్టియభీష్ట మట్టి
వార లెల్లను నేధరణీరుహంబు
కొలిచి వడసిరి తమతమకోర్కు లెలమి.

56


తే.

అట్టి బిల్వంబుపేరఁ బ్రఖ్యాతమైన
యమ్మహాతీర్థరాజసామర్ధ్య మెల్లఁ
దెలుపు నితిహాస మొక్కటి గలదు వినుము
దానఁ బెడబాయుఁ బటుదురితవ్రజంబు.

57


సీ.

కలఁడు సోమకుఁ డనగా నొక్కరాజర్షి
వంశదీపకుఁడు దుర్వారబలుఁడు,
సత్యసంధుఁడు సర్వశాస్త్రతత్వజ్ఞుఁడు,
శమదమాన్వితుఁడు సజ్జనహితుండు,
జలధివేష్టితమహిచక్రేశ్వరుఁడు, నిత్య
ధర్మశీలుఁడు మహాదానశాలి