ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

తృతీయాశ్వాసము


దేవునిశక్తికి హీనం
బై వెసఁ జలియించునే తృణాగ్రంబైనన్.

261


ఉ.

ఆపరమేశ్వరుం డరయ నాగమవేద్యుఁడు వేదచోదితం
బై పెను పొందు ధర్మ మఖిలాశ్రయ మాసరణిం జరించువా
రాపదఁ జెంద కెందుసుఖమందుదు రుత్పధవర్తులై తదా
క్షేప మొనర్చు నీచులు నశింతురు దుస్తరనారకాగ్నులన్.

262


తే.

ఆది పరమాత్మసంకల్ప మైనయట్టి
ధర్మమార్గంబు దప్పి గంధర్వవిభుఁడు
చక్రి దివ్యాలయచ్ఛాయ నాక్రమించి
కనియెఁ దత్పాపమున నిట్టి కష్టదశలు.

263


వ.

అనినఁ బాకశాసనుఁడు జలజాసనుఁ గనుంగొని.

264


క.

తోయజభవ! హరిభవన
చ్ఛాయాలంఘనము సేయ సమకొనుపాపం
బేయది తుది నది పాయు ను
పాయం బేతెఱఁగు తేఁటపఱపుము నాకున్.

265


సీ.

నావుఁడు నజుఁడును దేవేంద్ర! వినుము చె
ప్పెదఁ బరప్రత్యక్షభేదములును
ద్వివిధమై దాను వర్తించుభూతావలి
యందు స్వచ్ఛాయ ప్రత్యక్ష మనఁగ
నమరు నాయుఃక్షయం బైనవారల కది
దునుకబోయిన రీతిఁ దోఁచు నొండెఁ
బొడగానఁగా రాక పోవు నీజాడ న
ది విను స్వచ్ఛాయయ దృష్ట మనఁగ


తే.

భువిఁ బరచ్ఛాయఁ దాజ్యేష్ఠమునుగనీయ
సంబు నన రెండువిధములు జరుగుచుండుఁ