ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

87


వారును ఘనభోగవాంఛాపరాయణు
లగువారు గల రెవ్వ రట్టిపురుషు
లందఱు నస్మదాజ్ఞానుపాలనము సే
యుదురు యాగవ్రతానూనదాన
ముఖ బహుశుభకర్మములు నాకుఁ బ్రియముగాఁ
గావింపుదురు నీకు నావిధమున


తే.

ధర్మ మెడలక మత్పరతంత్రవృత్తిఁ
దగిలి రాజ్య మొనర్పుము తలఁపు నన్ను
నేను నిన్ను నుపేక్షింప నేఁగుదేర
వలవ దెన్నఁడు నీవు నీవారు నిటకు.

188


వ.

మఱియు నొక్కవిశేషంబు విను మెల్లకాలంబును బట్టణాభిముఖుండనై
వీక్షింపుచుండుదు. పంచజనులు పాపకర్ము లగుటఁ జేసి నీవల ననుగ్రహంబు
సేయుచు నన్నభిలషించి దూరదేశాగతు లయినవారలకుఁ బరమపద
ప్రాప్తియు-మనోరథంబులు నిత్తు, నీద్వీపంబు పుణ్యభూమి యగుటంజేసి
యచ్చోటనెయుండి సంస్మరింపు, మత్యంతసుకృతంబు సంభవించు-నొక్కొక
యేటఁ బుణ్యదినంబులందు మత్సందర్శనంబున కతిరహస్యంబుగాఁ గామ
రూపంబు గైకొని రమ్ము-పొమ్మని మఱియు నిట్లనియె.

189


ఆ.

ధర్మములును సకలకర్మఫలంబులు
పరిహసించి శరణుఁ జొరుము నన్ను
నిదియె నీకు మోక్షపదపరప్రాప్తికి
నలినహస్య మైన యట్టిమతము.

190


చ.

అని హరి పల్కినన్ వినతుఁడై మరియొండన నోడి-లంకకుం
జనియే విభీషణుండు, మునిసంఘములో నిట ధర్మవర్మయున్
విముతవిశిష్టపూజనలు వేడుకఁ జేయుచునుండె భక్తహృ
ద్వనజవిహర్తకున్ దవనివారణకర్తకు రంగభర్తకున్.

191


క.

అది యాదిగఁ గావేరీ
నదిఁ జెలువగు పులినతలమునన్ హరికి నిజా