ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

43


క.

దివి నౌపేంద్రస్థానము
రవి మండలమును సుధాంబురాశియు నన నే
నివసించు కందువలు మూఁ
డవుటఁ ద్రిధామాఖ్య ముఖ్య మయ్యెను నాకున్.

205


వ.

తత్ప్రదేశంబులందును రాజసతామసాత్ములకు దుర్విభావ్యుండనై యుండుదు
వెండియు లోకానుగ్రహార్థం బొక్కొక్కయెడల నావిర్భవించియు నొక్కొక్క
విభావంబునం దావేశించియు నొక్కొక్కఠావుల జన్మప్రసంగంబు
లంగీకరించియుఁ బ్రతికల్పంబున నవతారసహస్రంబులు గైకొందు సత్వా
యత్తులై మదేకచిత్తులయిన యుత్తములయెడఁ దద్గుణకర్మాభివృద్ధ్యర్థం
బత్యంతరాగాసక్తుండనపోలె సకలంబు ననుసంధింతు, బితృపుత్రవాత్స
ల్యంబుల నైనను మిత్రామిత్రంబుల నొదవు రాగాపరాగంబులనైనఁ బ్రాణి
స్తోమంబు నామీఁదఁ దలంపు గలిగి యేవిధంబున వర్తించు నావిధంబున
కనురూపంబులు ధరియింతు, నవియునుంగాక ద్వీపవర్షతీర్ధాయతనంబులందు
బ్రతిగ్రామగృహంబుల ప్రతివర్షంబుల దారులోహశిలామయంబు లగు
నర్చాభేదంబుల నుల్లసిల్లుదు నట్టియర్చావతారంబులు స్వయంవ్యక్త దివ్య
సైద్ధమానుషంబులనఁ జతుర్విధంబుల మెఱయు నందు శ్రీరంగ శ్రీముష్ణ
శ్రీవేంకటాచల సాలగ్రామ నైమిశ తోతాద్రి పుష్కర నారాయణాశ్రమంబులను
నీయెనిమిదిస్థలంబులం గల మదీయమూర్తులు స్వయంవ్యక్తంబులు హస్తిగిరి
వృషపర్వత చక్రతీర్థాది ప్రశస్తదేశంబులు భవధర్మ శతముఖ ప్రముఖ
దేవప్రతిష్ఠితంబులైనయవి దివ్యంబులు, భృగుతీర్థ మందరక్షేత్ర చిత్రకూట
ప్రభృతి పుణ్యస్థలంబులు, భృగుమరీచి మతంగజముని సిద్ధసంస్థాపి
తంబులైనయవి సైద్ధవంబులు, విశిష్టాగమోక్త ప్రకృష్ట శుభలక్షణలక్షితంబు
లయి శుచిద్రవ్యరచితంబు లయినయవి మనుష్యస్థాపితంబులై యున్నయవి
మానుషంబులు, వీనిలో స్వయంవ్యక్తంబులై యున్నయవి వికృతిమయంబు
లైనను బూజాతిశయంబునను బింబాభిరూప్యంబునను బ్రసన్నుండనై
సాన్నిధ్యంబు వహింతు. మత్ప్రభావంబున నీస్వయంవ్యక్తాదులకుఁ గ్రమం
బున ద్వేతౌర్థ(?)పాదయోజనమాత్రక్షేత్రంబు పరమపవిత్రంబునై
యతిశయిల్లు.

206


క.

శ్రీమెఱయ నెచట సాల
గ్రామశిలార్చనము గల్గుఁ గల్యాణకరం