ఈ పుట అచ్చుదిద్దబడ్డది
205
29వ అధ్యాయము.
ఒకసారి నేను బండిలోనెక్కిపోవుచుండగా ఒకమిద్దెపై నిలుచుండిన యిరువురువ్యభిచారిణులు గాంచనయ్యెను. కాని వారిలో నాదివ్యజననియే ప్రత్యక్షమగుటచేత ప్రణామము చేసితిని.
ఈ చిత్త వైఖరి నాకు లభించినప్పుడు (దక్షిణేశ్వరాలయమునందలి) కాళీమాతను పూజించుటకును, అర్పణలు చేయుటకును, సాధ్యముకాకపోయినది. నాస్థితిచూచి దేవాలయపు యజమాని నన్ను మందలింపసాగెను. అప్పుడు నాకెంతమాత్రము రోషమువచ్చెడిది కాదు; వానిమందలింపులు విని నవ్వెడివాడను.