పుట:Shodashakumaara-charitramu.pdf/56

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

45


నాఁటి నిశాసమయంబునఁ దోరణస్తంభంబున కరుగునప్పు డంతకుమున్న యేనును నతిరయంబునం జని హరిమందిరం బెక్కి యేకాదశీవ్రతపరాయణులై యున్న విప్రులు విన నేఁడు మహామారీపతనం బగు నేమఱకుండుం డని పలికి వారు గానకుండ నేను సురిఁగి యరిగితి వారు వెడలి వచ్చి చూచి యరసి యెవ్వరిం గానక యది యాకాశవాణిపలుకుగా నిశ్చయించి.

168


క.

హస్తములు మోడ్చి శాంతి
స్వస్తికమంత్రములు నెరయ వారందఱు లో
కస్తవ్యోక్తుల దుర్గం
బ్రస్తుతి సేయంగ నర్ధరాత్ర మగుటయున్.

169


వ.

అంతకమున్న యెవ్వరు నెఱుంగకుండఁ దోరణస్తంభం బెక్కి యున్న మకరదంష్ట్ర యయ్యవసరంబున.

170


క.

స్తంభాగ్రతలమునను సం
స్తంభమ్మునఁ బవనుచేతఁ దల్లడపడుచుం
గుంభినిపై నుఱుకుదునా
యంభోరుహనయన యనుచు నతిరావమునన్.

171


వ.

ఎలుఁ గిడిన నయ్యెలుంగు విని యిదియ మహామారీభాషణం బనుచు నమ్మహీసురులు మస్తకన్యస్తహస్తులై ప్రస్తుతించుచు నోదేవీ! మాకీర్తనంబు లుల్లంఘింపక మామీఁద లఘింపక మమ్ము మన్నింపు మనుచు నుండ సైరింపలేక మకరదంష్ట్ర కంపంబు నొందుచు మఱియును.

172


క.

పడుదుం బడుదు ననంగాఁ
బడకు పడకు మనుచు వారు ప్రార్థింపంగా