పండితారాధ్యులు.
13
పైయంతరువులోనిదేయనియంగీకరింపకపోరు. "శివుఁడు విష్ణువరేణ్యుఁడు గోవిందవరేణ్యుఁడు" నని యీతఁడు చెప్పుటలోఁ గ్రొత్తలేదు. కేవల వైష్ణవులు కానివా రందఱును శివాధిక్యము నంగీకరించుచున్నారు. పైసమాస మీయర్థమునఁ బొసఁగునా? "
భక్తిపై నీతఁడు వ్రాసిన రెండుమూఁడు పద్యములు శైలికిఁ జూపెదను.
క. ఒక్కం డీశ్వరుఁ డని మది
నిక్కముగా నెఱిఁగి భక్తి నిష్ఠావృత్తి౯
ముక్కంటి నిన్నుఁ గొలిచిన
ద్రిక్కక దొరకవె సమస్తదివ్యసుఖంబుల్|| 99
క. అరుదుగ భవత్ప్రసాద
స్ఫురణము దొరకొనుశివభక్తి గాన ధుస్తరభవని
ష్ఠురదుఃఖసముద్రసము
త్తరణవహిత్రంబు భక్తి దానయ్యె శివా! 107
క. వసుమతిఁ జిత్రము జితచి
త్తసంభవా"నకర్మణావతపసానజపై
ర్న సమాధిభిరవ్య యనీ
య సదృశభక్తి”కినిఁ బ్రియుఁడ వగు దీశానా|| 111
కన్నడకవి చరిత్రమునందీతని గూర్చివ్రాసిన విశేషములు.
"ఇతఁడు(పండితయ్య ) గణసహస్రనామముఇష్టలింగ స్తోత్రము, బసవగీత మొదలగు గ్రంథములు వ్రాసినట్లు తెలియుచున్న ది. గురురాజు వ్రాసిన సంస్కృత పండితచరిత్రము (15వ శతాబ్దము) నీలకంఠుని యారాధ్యచరిత్రము (15 శతాబ్దము ) సిద్ధనంజేకునిగురురాజచరిత్రము (16 శతాబ్దము) ఇవి మొదలైన గ్రంథములయందీక్రిందియంశము లీతనిగుఱించి తెలియుచున్నవి. (ఇచ్చట మనకుఁదెలిసినవిషయములే వివరించిరి. ఈతఁడు బసవనిభస్మము నంది; కర్ణాటకభాష రా నందే పై గ్రంథముల వ్రాసెను. ఈతనిగణసహస్రనామము మాత్రము దొరుకుచున్నది. తక్కినవి దొరకలేదు. గణసహస్రనామము వెలనాటిచోడునిసభలో హరనింద విన్నదోషము, బౌద్దాచార్యులతో వాద , మొనరించినప్పుడు కలి