పుట:Shathaka-Kavula-Charitramu.pdf/124

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బద్దెన.

41

క. పొరుగునఁ బగవాడుండిన ! నిరవొందగ వ్రాతకాఁడె యేలిక యైనన్
   ధనఁ గాఁపు కొండె మైనను | కరణాలకు బ్రతుకు లేదుగదరా సుమతీ. 81

ఇప్పటికిని గ్రామపరిపాలనమునందు మునసబుకరణము లైకమత్యము చెడినచోఁ గరణమునకు వచ్చుకష్టములు వేఱుగ నిర్వచింప నక్కఱలేదు. అనఁగా గ్రామాధికారి యగుమునసబునకు వ్యతిరేకముగఁ గరణము, దుష్టుఁడయ్యు నేమియుఁ జేయఁజూలఁడు. పూర్వము పెత్తనదార్లను కాఁపు లుండుటయు, వారికిఁ గరణము బాసటయై, లెక్కలు వ్రాసి, నాయపడుటయు, గ్రామపాలనము సుఖముగ నుండి ప్రభుత్వము సాగుటయు మనపెద్దలు చెప్పుదురు. కావునఁ బ్రస్తుతము “మునసబు" పదము గ్రామాధికారికి వాడిన తుఱక ప్రభుత్వమునకుఁ బూర్వ మీశతకమువ్రాసి యుండవలసినట్లు కనబడుచున్నది. అనఁగ స్థూలముగ 12, 15 శతాబ్దముల నడుమ నిది పుట్టి యుండవచ్చును. బద్దెనకూడ 12, 13, శతాబ్దములవాఁడని కొంద ఱనుచున్నారు. కావున వ్యతిరేక నిదర్శనములు లేనంతవఱకు బద్దెన దీనికర్తయని శ్రీ కవిగారిపద్యానుసారము నమ్మవలసివచ్చుచున్నది. స్థితిగతు లీవిధముగ సందేహాస్పదముగ నుండఁగ నీనడుమ నొక విచిత్రవిషయము కనఁబడినది. అది శ్రీకవిగారిసిద్ధాంతమును బలపఱచునది. కావున వారివాదమును ఖండించుట కింతకంటెఁ బ్రబలవాదము మానవలసివచ్చినది. విజ్ఞులుకూడఁ బరికించెదరుగాక!

కర్తృత్వము సరియా?

ఆంధ్రసాహిత్య పరిషత్పుస్తకభాండాగారము నె 1679రు తాటియాకుగ్రంథములోఁ బ్రసిద్ధ మగు నీక్రింది. సుమతిశతక పద్య మిట్లున్నది.

(1) సుమతిశతకము నందున్న విధము.

"పతికడకుఁ దన్నుఁగూర్చిన | సతికడకును వేల్పుకడకు సద్గురుకడకు౯
 సుతుకడకు రిత్తచేతుల | మతిమంతులు చనరు నీతిమార్గము సుమతీ. 67

(1) పరిషత్తువారి తాటియాకుప్రతిలో నొకచోట