ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా లవ ఆ ధ్యాయము

49


బులకు మిగుల సంతసంబందెను. ఇదియునుగాక రెండవతడవ నాపూఁబోడి తనతండ్రి వెంట నింగ్లండునకుఁ జనుదెంచి ఆస్బోరనులో నుండిన విక్టోరియాను జూచి తన రాజ్యమునకు మఱ లెను. లండనుపురి పౌరు లాచిన్న దాని సొబగును విన్న వారు కాని ఆతరుణిని గని యెఱుంగరు. అనేకు లనేకభంగుల నాయమ సౌదర్యంబును మదిలోఁ బొగడు చుంచుడిరి. కొందఱు ' మే మా య లెగ్జాండ్రాను, డెనార్కులోఁ గన్నారము. జను లనుకొమరీతిని అంతచక్క నీపూఁబోడి కాదు. ఏమో గొప్ప రాజుకుబత్ని కాఁబోవు చున్నది. అయిన సద్గుణగణఖని యుట,” అని వక్కాణించిరి. మణికొందఱు "అలెగ్జాండ్రా మంచి చక్కనిది.మిక్కిలిచదువరి. నిగర్వ ఆశ్రయించిన వారి పాలిట కల్ప వృక్షము.మనలఁ గన్న తల్లి మాదిరి గాపాడును.” అనిరి. ""ఓ ! ఈయలెగ్జాండ్రా ఎవ రో? అనుకొంటిని. మొన్న నాతోఁగూడి యాడు కొన్న చిన్న దా? దాని "కా పెండ్లి ! ఆతరుణియేనా మన యెడ్వర్డును బెండ్లియాడఁ బోవు చున్నది : ? 'దానికి సంతభాగ్యము? దాని యదృష్ట మే అదృష్టము." అని వెండియుఁ గొందుఱు పల్కిరి...“ఆయ లెగ్జాండ్రా మనకు రాణి అగుట మనకు లాభమును, , డెన్మాక్కు- దేశస్థులకు గొప్పనష్టమును గాదా? అని ఇంక గొందఱు వాక్రుచ్చిరి, విక్టోరియాయాస్థానపుఁగ వీశ్వరుండైన టెనిసనను కవి చంద్రుఁ.డు.. పెండ్లి కై ఇంగ్లండునకు నేతెంచు చుండిన అలెగ్జాండ్రాకు నిటులఁ బద్య రూపంబున స్వాగత మెచ్చెను.