చామర్లకోట సంగ్రహ ఆంధ్ర
చాళుక్య భీమేశ్వర దేవహర్మ్యం
త్రింశత్సమాభూతలమన్వరవత్"
అని యొక శాసనమున గలదు. చాళుక్యభీముడే తన పేరును దేవున కిడెనని కొందరందురు. ఈశ్వరపుత్రుడగు కుమారస్వామిచే నిట శివలింగము ప్రతిష్ఠితమగుటచే నిది కుమారారామము, స్కందారామము అని కొన్ని శాసన ములలో బేర్కొనబడినది. తారకాసురుని మెడలోని అమృతలింగమును కుమారస్వామి యైదు ఖండములుగా ఖండింప నందొక ఖండ మిట బడినందున నీ క్షేత్రము పంచారామ క్షేత్రములలో నొకటియై ప్రఖ్యాతమైనది. 'అదె కుమారారామ మాహర్మ్యరేఖయ చాళుక్య భీమేశు సదనవాటి' అని శ్రీనాథ కవిసార్వభౌముడీ క్షేత్రమును గూర్చి తన భీమేశ్వర పురాణమున నుగ్గడిం చెను. చాళుక్య రాజరాజనరేంద్రునికి గూడ భీమేశ్వరుడు ఉపాస్యదై వమై యుండునని "భారత శ్రవణాసక్తియు, బార్వతీపతిపదాబ్జధ్యాన పూజామహోత్సవమున్... ఇవి యేనున్ సతతంబు నా యెడ గరంబిష్టంబులై యుండు" నన్న భారత వాక్యమువలన గ్రహింపదగును. ఇట చాళుక్య భీముని కోట ధ్వంసమైపోగాఁ బిమ్మట క్రీ. శ. 1400 ప్రాంతమున కాటయవేమారెడ్డి రాజమహేంద్రవరమున రెడ్డి రాజ్య పాలనము గావించుచు తూర్పు దేశములను జయించి భీమవరమున పూర్వము కోటయుండిన స్థల మును ద్రవ్వింపగా, మహిషాసురమర్దని శక్తి విగ్రహము దొరకినది. దానికి శ్యామలాదేవి యను పేరిడి, ఆలయము గట్టించి, యట గ్రామము నిర్మించి, దానికి శ్యామలా దుర్గమని పేరిడెను. అదే సామర్ల కోట. ఇది సామర్లకోట కై ఫియతునందు వ్రాయబడినది. ఆ మహిషాసురమర్దని తరువాత భీమేశ్వరాలయమును చేరుకొన్నది. 'భీమ నాయక దేవు పేరురంబున గ్రాలు భుజగహారములకు భుక్తి వెట్టి, రాజనారాయణస్వామి రమ్యభవన తార్క్ష్య కేతన పతికి నర్తనము గరపి' అని శ్రీనాథకవి యిచ్చటి గాలు లను వర్ణించెను. ఈ భీమేశ్వర, నారాయణస్వాముల అలయములలో ముప్పది శాసనములు గలవు. వీనిలో క్రీ. శ. 1087 నాటిది అతి ప్రాచీనము. 1993 నాటి తామ్ర శాసన మొకటి కాటయ వేమారెడ్డి రాజనారాయణ స్వామికి భూరిదానములు చేసినట్లు తెల్పును.
చాళుక్యభీము డీ భీమేశ్వరాలయమును, దాక్షారామ భీమేశ్వరాలయమును ఇంచుమించుగ నొకేరీతిగా నిర్మించెను. ఆఆలయము చుట్టును పదు నెనిమిది యడుగుల ఎత్తు గల ప్రాకారమున్నది. ప్రాకారము నలుమూలల నాలుగు గోపురములున్నవి. యాత్రికు లుత్తరద్వారమున లోపలి యావరణములో ప్రవేశించి, తూర్పు ద్వారమునకు వచ్చిన నట కోనేరు గలదు. కో నేటిమధ్యమున నొక మండపము ఉన్నది. కో నేటిలో యాత్రికులు స్నానతర్పణములు గావింతురు. ధ్వజ స్తంభమును దాటి ముందున కేగిన నట పెద్ద నంది గలదు. లోపలి ప్రాకారములో గణపతి, సరస్వతి మొద లగు దేవతల విగ్రహములున్నవి. స్వామి ప్రధానాలయము రెండంతస్తులుగా నుండును. దాక్షారామము నందువలెనే క్రిందియంతస్తు చీకటికొట్టు. మీడియంతస్తుననే అభిషేకా దులుచేయుదురు. లింగము గోధుమవన్నెగలిగి, మొత్తము పదు నెనిమిది యడుగుల యెత్తుండును. పార్థుడు కొట్టిన దెబ్బలు సూచించుటకన్నట్లు లింగము శిరస్సు ఎగుడు దిగుడుగా నుండును. ఉత్తరదిశలో మూలను ఊయెల ఆ మండపమున్నది. ఇది కదిపినచో నూగుచు ఆ కాలపుశిల్ప నిర్మాణనై పుణిని దెల్పును. ఆలయ పశ్చిమ ద్వారమునకు కొలదిదూరములో నొక పెద్ద రాతి స్తంభమును, దానిపై నొక నంది విగ్రహమును గలవు. భీమవరాగ్రహారము పాడుపడిన తరువాత నీట నొక గొల్లది స్వామికి నిత్య మును పాలు పెరుగులు నివేదన యిడెడిదనియు, నామె స్మృతి చిహ్నముగ నీ స్తంభము నిర్మింపబడెననియు దెల్పుదురు. శివరాత్రికి స్వామిక ళ్యాణాదులు జరుగును. ఇతర పర్వములలోగూడ భక్తు లభిషేకాదులకు ఆలయ మునకు వత్తురు. భీమేశ్వరాలయమునకు పశ్చిమమున రెండు ఫర్లాంగుల దూరములో రాజనారాయణస్వామి ఆలయ మున్నది. ఇది విష్ణ్వాలయము. ఇందలి మూర్తి మాండవ్య నారాయణస్వామి. ఇందలి విష్ణువిగ్రహము క్రింద పరసు వేదియుం డెననియు, చోరుడు యత్నింప వానిచేయి యం దంటుకొనిపోయె ననియు, వాడు స్వామిని ప్రార్థింప చేయి యూడివచ్చె ననియు స్థలపురాణగాథ చెప్పుదురు. దానిని దొంగిలింపనొక
వ్యాసుడు ఈశ్వరునిచే వెడలనడుపబడి కాశిని వీడి దక్షిణకాశియగు దక్షారామమున కేగుచు పీఠికాపురము 646