విజ్ఞానకోశము - 3 కేరళదేశము (చరిత్ర)
ఇతడు కుల శేఖరాళ్వారు అని పిలువబడి, పన్నిద్దరాళ్వారు
లలో చేర్చబడెను. ఈ కులశేఖరుడే 'తపతీ సంవరణమ్'
సుభద్రా ధనంజయము అను సంస్కృత నాటకములను.
'ముకుందమాల' అను సుప్రసిద్ధ స్తోత్రమును వ్రాసెను.
కుల శేఖర పెరుమాళ్ రచించిన తమిళ స్తోత్రములు
నాలాయిర ప్రబంధములో గలవు. దీనినిబట్టి చేర రాజుల
కాలములో తమిళ భాషయే కేరళ భాషగా వెలసినదని
తెల్ల మగును. ఈ చేర పెరుమాళులలో నొక రాజు అపు
డపుడు కేరళ తీరమునకు వ్యాపారముకొరకు వచ్చిన
అరబ్బులతో ఏగు దెంచిన ఒక ముస్లిము గురువు ప్రభా
వమున ఇస్లాంమతము నవలంబించెను. “నేను కాబాకు
వెళ్ళివచ్చెదను. అంతవరకును కత్తిని ధరించి నా ప్రతి
నిధివై పరిపాలింపుము" అని తవ అన్న కుమారునకు
రాజ్యము నప్పగించి వెళ్ళి అతడు అక్కడనే పరమ
పదించెననియు, అప్పటినుండియు రాజ్యమును పాలించిన
వారందరును, కత్తిని సింహాసనము నధిష్ఠింపజేసి తత్ప్రతి
నిధులుగా పాలించుచు వచ్చిరనియు కొన్ని చారిత్రి
కాధారములను బట్టి నిర్ణయింపబడినది.
రాజుల
చేరరాజుల పరిపాలనమునందు కేరళతోపాటు నేటి
కోయంబత్తూరు జిల్లాలోని కొన్ని భాగములు కలిసి
యుండెనని తెలియుచున్నది. చేరరాజుల యొక్క పరి
పాలన రెండవసారిగా పై నుదాహరింపబడిన
కాలముననే ప్రారంభింపబడినట్లు తెలియుచున్నది. ఈ
ఇరువురి తరువాత రాజ శేఖర, స్థానురవి, భాస్కరరవి
వీర కేరళ ప్రభృతులు కొందరు రాజులు ఏలినట్లు తెలియు
చున్నది. కాని క్రీ. శ. 10వ, 11వ శతాబ్దములందు
చోళ రాజులయిన రాజరాజు, రాజేంద్రరాజు, చేర రాజుల
నోడించిరి. అందువలన చేరరాజుల బలము చాలవరకు
సన్నగిలినది. శాసనముల వలనను, మరికొన్ని ఆధార
ముల వలనను, ఆ కాలపు చేరరాజులను గురించి కొద్ది
కొద్దిగా తెలియుచున్నది.
ఐదునాల్గవ శతాబ్దముయొక్క ఆరంభమున మరియొక
గొప్ప రాజు ఉదయించెను. రవివర్మ కులశేఖర (సంగ్రా
మధీర) అనురాజు మరల దక్షిణదేశ చరిత్రలో తన
యొక్కయు, తన రాజ్యము యొక్కయు ప్రఖ్యాతిని నిల
బెట్టెను. కంచీపుర శాసనములవలన రవివర్మ జీవిత
చరిత్రమునందలి కొన్ని కొన్ని ముఖ్యాంశములును, కాల ములును, మనకు తెలియుచున్నవి. ఇతడు క్రీ. శ. 1266 వ సంవత్సరమున జన్మించెను. 33 సంవత్సరములు వయస్సు వచ్చుసరికి ఇతడు కేరళ దేశమంతటికిని అధికారి అయ్యెను. నలుబదిఏడు సంవత్సరములు వచ్చుసరికి (క్రీ. శ. 1818) ఇతడు దక్షిణాపథమునకు 'మహారాజు' అను బిరుదమును కాంచీపురములో స్వీకరించెను. పాండ్య రాజులను, చోళ రాజులను జయించెను. పాండ్య రాజయిన విక్రమ పాండ్యుని కూతును వివాహమాడెను. ఈ పట్టాభిషేక మహోత్సవము శ్రీరంగమునందును, తిరువాడియందును, జరుపబడెను. కాని దక్షిణభారతమునకు గొప్ప రాజకీయ సంక్షోభము కలుగనున్నదని, మహమ్మదీయ రాజయిన మల్లిక్ కాఫరు హొయసాలుల నోడించి పాండ్యరాజుల పై దాడి వెడలిన సందర్భమున రవివర్మ గట్టిగా గ్రహించెను. ఇతని ప్రథమవిజయ ప్రయత్నములు ప్రాతిపదిక ములుగా దక్షిణదేశమందు విజయనగర సామ్రాజ్యము స్థాపింప ౨ బడెననుట అతిశయోక్తి కాదు. ఇతడు మహాకవియు, కవి పోషకుడును విద్వాంసుడునై యున్నాడు. 'ప్రద్యుమ్నా భ్యుదయము' అను నాటకమును సంస్కృతమున రచిం చిన దిట్ట ఇతడు. పట్టాభిషిక్తుడయిన కొలది కాలమున కే దివంగతుడయ్యెను. రవివర్మ విదప నవీనయుగము వరకు కేరళ దేశము అనేక రాజులచే పరిపాలింపబడెను. చేర రాజులకును పాండ్యరాజులకును మధ్య, అపుడపుడు కొద్దిపాటి యుద్ధ ములు జరుగుచుండెను. తిరువాన్కూరు రాజకీయవేత్తలయిన మహారాజులచే పరిపాలింపబడెను. భారత దేశమునందు ఎచ్చటను అమ లులో లేనప్పుడు మొట్టమొదట తిరువాన్కూరు సంస్థా నములో, బాధ్యతాయుత ప్రభుత్వమును, వయోజనుల ఓటింగు పద్ధతియు ప్రవేశ పెట్టబడినవి. సాంఘిక సంస్కార పరము లై న శాసనములు కావించుటయందుగూడ భారత సంస్థానములన్నిటికం టెను కేరళము మిన్నయైనది. విద్యా వ్యాప్తి (ముఖ్యముగా స్త్రీ విద్యావ్యాప్తి) గావించుట యందును కేరళమే అగ్రతాంబూలమునకు అర్హమైనది. కేరళ రాజకీయ చరిత్రము నేటి కేరళ రాష్ట్రము
దాదాపు పదునొకండు వందల సంవత్సరములనుండి
27