పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/407

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటుపల్లి

సంగ్రహ ఆంధ్ర

దలతోను, ఉత్సాహముతోను తాను ప్రారంభించిన చరిత్ర రచనను విజయవంతముగా సాగించెను.


గిబ్బను మహాశయుడు తన గ్రంథమును ముగించిన నాటి పరిస్థితి నిట్లు తన జీవిత చరిత్రలో వ్రాసెను.

"1787 వ సంవత్సరము జూన్ 27 వ తేదీ రాత్రి పదకొండు పన్నెండు గంటలమధ్య నా తోటలోని వేసవి గృహములో, నా రోమను సామ్రాజ్య పతన చరిత్ర చివరపుటలోని, చివర వాక్యమును ముగించి, కలమును క్రిందబెట్టి, తోటలోగల చెట్లమధ్యలో ఎన్నో పర్యాయములు పచారు చేసితిని. అచటి నిర్మానుష్యమైన సుందర ప్రకృతి, నిర్మలాకాశములోని చంద్రుడు, చుక్కలు, కొండలు, గుట్టలు, చెట్లు ఆ సమయములో సరస్సులో ప్రతిబింబించుచుండెను. ఆ పవిత్ర సమయములో నేను చిరకాలమునుండి, పడిన శ్రమకు ఫలితముగా లభించిన విశ్రాంతిని గురించిగాని, లేదా నాకు రాబోవు ఘనకీర్తిని గురించిగాని, నేను పొందిన ప్రథమానందమును వర్ణింపనుగాని, నేను నా చిరకాలమిత్రమైన గ్రంథము నుండి శాశ్వతముగా వీడిపోవుచున్నందుకు కలిగిన దుఃఖభావమును, విచారమును వినమ్ర హృదయముతో ప్రకటింపక తప్పదు. కారణ మేమనగా, భావికాలమున 'ఆ చరిత్ర గ్రంథమునకు సరియైన గౌరవాదరములు లభించునా, లభింపవా ?' అని నా కేమాత్రము విచారము లేదు. ఎందువల్లననగా 'చరిత్రకారునియొక్క జీవితము మిక్కిలి చిన్నదిగానుండి అనేక అపాయములతోను, బాధలతోను నిండియుండును' అని నాకు తెలియును.”

గిబ్బను అంత్య జీవితము చాల విషాదముగా గడచినది. చివరదినములలో అనేకమంది స్నేహితులు, ఆప్తబంధువులు చనిపోవుటవలన అనేక విచారములకు గురియై 1793 వ సంవత్సరపు వేసంగిలో 'ససెక్సు' అను గ్రామములోని తన స్నేహితుడయిన 'షెఫీల్డు' అనువానితో గడపుటకు వెళ్లెను. కాని దురదృష్టవశాత్తు ఆతని జీవిత అంతిమాధ్యాయము క్రమముగా సమీపించుటచే లండను నగరమునకుపోయి, జలోదర రోగముతో సెంటు జేమ్సు స్ట్రీటునందు 1794 వ సంవత్సరము 16 జనవరినాడు శాశ్వతముగా కన్నుమూసెను.

గిబ్బను తాను రచియింప దలచిన రోమను సామ్రాజ్య పతన చరిత్రను 98 A.D. లో రోమను సామ్రాజ్యమును పరిపాలించిన 'టిటస్ ' చక్రవర్తితో ప్రారంభించి 1453 వ సంవత్సరమున 'టర్కీ' వారు 'కాన్‌స్టాంటి నోపిలు' పట్టణమును స్వాధీనము చేసికొనినంతవరకును రచించెను. ఆతడు అతిపురాతన కాలమునుండి నేటి నవీన నాగరికత వరకును సంభవించిన అనేక మార్పులను గ్రహించి, చిందరవందరగా నున్న అనేక చరిత్రాంశములను, ఒక దానితో నింకొకదానికిగల సన్నిహిత సంబంధమును క్రమపద్ధతిపై నేర్పరచి, పదునాలుగు శతాబ్దముల మధ్యకాలమున నున్న సువిశాలమయిన రోమను సామ్రాజ్య చరిత్రను సుస్థిరమైన పునాదులపై నిర్మించి చరిత్ర రచనయందు చక్కని రాచబాటను ఏర్పాటుచేసి, ఆ చరిత్రకును, ప్రపంచమునకును మహోపకారము చేసెను.

గిబ్బను ఈ చరిత్ర రచనయందు కొన్ని లోపములు చేసెను. అతడు మతమునకు సంబంధించిన సరియైన పరిజ్ఞానము లేకుండగనే నిర్దయతో ఆవిషయములను గురించి చర్చించుటయేగాక పూర్తి క్రైస్తవ మతమునకు సంబంధించిన అనేక విషయములను అనవసరముగా నుదాహరించుచు, లేనిపోని వాదములను లేవతీసెను. అందువలన ఆతని చరిత్ర గ్రంథముపై వాదప్రతివాదములు బయలు దేరినవి.

గిబ్బను తన చరిత్ర గ్రంథమును శిల్పరీత్యా సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దుటలో ప్రతిభావంతుడైన స్వతంత్ర కళాకారునివలె ప్రవర్తించెనేగాని, అనవసరముగా ఇతరులను అనుకరించుట కేమాత్రమును ప్రయత్నించలేదు.

గిబ్బను కావించిన ఉత్తమ చారిత్రక రచనవలన, చరిత్రకు ఒక విశిష్టత లభించినది. ఈనాడు చరిత్ర సారస్వతము నందొక ముఖ్య భాగముగ పరిగణింపబడుటకు గిబ్బను మహాశయునివంటి ఉత్తమ చారిత్రకుల కృషి యే మూలము.

పు. వేం.

గుంటుపల్లి :

ఆంధ్రప్రదేశములో నున్న అతి పురాతనమైన బౌద్ధ క్షేత్రములలో గుంటుపల్లి ఒకటి. ఇది క్రీ. పూ. రెండవ, మూడవ శతాబ్దులలో ఆంధ్రదేశమును పరిపాలించిన

358