పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/291

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

గణపతిదేవుడు - కాకతి

సంగ్రహ ఆంధ్ర


“ప్రజఁ జెఱిచి కూడబెట్టిన
 నిజధనమది వలయు వ్యయము నిచ్చలుఁ జేయన్
 బ్రజయును ధనమును బొలిపిన
 భుజబలమున నిలువఁగలమె భూపతి కెందున్"

అని ప్రతిపాదించినాడు. ఈతని చెప్పుచేతలలో నడచి గణపతిదేవుడు ప్రజారంజకుడై నాడు.

గణపతిదేవుని రాజ్యమున డెబ్బది రెండు వినియోగంబుల వారుండిరి. ఈ డెబ్బది రెండు వినియోగంబుల వారిపై అధికారి యగుటచే గంగయ సాహిణి 'బాహ త్తరినియో గాధిపతి' అను బిరుదాంకితు డయ్యెను.

వ్యాపారము, ఆర్థిక వ్యవస్థ : దేశ ఆర్థికసంపద స్వదేశ విదేశ వ్యాపారముపైనను, పన్నులపైనను ఆధారపడి యున్నదని గ్రహించి గణపతిదేవుడు చక్కని నియమములతో కూడిన ప్రణాళికలను శాసించెను. నేటి గుంటూరు మండలమునందుగల బాపట్ల తాలూకాలోనున్న తీర గ్రామము మోటుపల్లి (వేలానగరము) నాడు సుప్రసిద్ధ రేవుపట్టణము. కాని దానికి సరియైన రక్షణము, పోషణములేక ప్రాంతీయ పాలకులచేత తీరస్థమైన నావలు కొల్లగొట్టబడుచు, అరాజక ప్రాయమైయుండెను దానిని గణపతి ఉద్ధరించి ఓడదొంగల బారినుండి నావలు రక్షింప బడునట్లేర్పాట్లు గావించి వర్తకుల రాకపోకలను నిరాటంక పరచెను. వర్తక సౌకర్యార్థమై ఒక్క కూపశుల్కము తప్ప తక్కిన సుంకములన్నిటిని ఎత్తివైచెను అచ్చట చెక్క బడియున్న శిలాశాసనమున నిబంధింపబడిన శుల్క వివరణమిది : "శ్రీగంధము 1 కి గ 1; పచ్చకర్పూరమునకు, చీని కర్పూరమునకు, ముత్యాలకు వెల గ 1 కి అ o ౻ ౾, పన్నీరు, దంతము, జవ్వాది, కర్పూర తైలము, రాగి, తగరము, సీసము, పట్టునూలు, పగడము, సుగంధ ద్రవ్యములకు వెల గ 1 కి 6 1 - మిర్యాలు వెల గ 1 కి 6 ౻ - , పట్టు స్వరూపము 1 - కి గ 1 కి G) ౻ o,” మొత్తమునకు ఎగుమతి దిగుమతియగు సరకులపై ముప్పదింట నొక్కపాలు సుంకముగ నిర్ణయింపబడినది. దీనినిబట్టి ఊహించినచో నాటి సముద్ర వ్యాపారమెంత అధికముగా సాగుచుండెడిదో ఎరుకపడును. దానికి గణపతిదేవుడు చేయూతనిచ్చి అభివృద్ధి గావించినాడు.

ఇంతియగాక స్థానిక మైన స్థల సుంకములు కొన్ని దేశవ్యా ప్తముగా వసూలు చేయబడుచుండెను. వానిని శాసన రూపమున బెక్కించి, వేయించుట నాటి అలవాటు. ఉదాహరణమునకు ఓరుగల్లులో ఖాన్‌సాహెబ్ తోటవద్ద రాతిపైనున్న శాసనము గైకొనవచ్చును. అందీ క్రింది విధముగా నున్నది :

“నీలి - మాడకు రెండువీసాలు

పోకలు - లక్షకు పాతిక

కూరగాయలు, మామిడి, కొబ్బరి మొదలగునవి - బండికి పాదిక.

నూవులు, గోధుమలు, పెసలు, వడ్లు, జొన్నలు, బండికి మానెడు .

ఉప్పు బండికి - పది పెరుకల మానెడు.

అవాలు మొ. - కాలకాండాలు - మాడ బాదిక.-

తగరము, సీసము, రాగి - తులమునకు 1 ఫలము.

కర్పూరము – వీసె 1 కి - 2 చిన్నాలు. - అవాలు మొ. కాండాలు మాడ బాదిక.

పట్టునూలు - తులము 1 కి - 1 చిన్నం.” మొదలగునవి. ఇంతేగాక మాగామ పన్ను, ఉప్పుపన్ను గూడ ప్రత్యేకముగా వసూలు చేయబడుచుండెడివి.

ప్రజోపకారములు : గణపతిదేవు డెన్ని యో ప్రజోప కారకములగు కార్యము లొనర్చెను. ఇప్పటి వరంగల్లు మండలములోని మొలుగు తాలూకాలోని గణపురమును నిర్మించి, అక్కడ ఒక పెద్ద తటాకమును త్రవ్వించెను. ఎల్గూరు గ్రామమును నిర్మించి, అదే పేరున పెద్ద తటాకమును, ప్రసిద్ధమైన పాకాల చెరువును త్రవ్వించెను. ఇట్లే లెక్కకు పెక్కగు గ్రామములను, శివాలయములను రాజ్యమంతటను వెలయించెను. దుర్గమారణ్యము లందు చక్కని బాటలు, సత్రములు, చలి పందిళ్లు వేయించి చోరాది బాధలనుండి ప్రజలను కాపాడెను.

కళలు : గణపతిదేవుడు కళా పిపాసి. తనకు మతముపై నున్న మక్కువను - శిల్పములోను, వాస్తువు నందును ప్రకటించి, భగవంతునికి నీరాజనమెత్తెను. తాను స్వయముగనేగాక, తన సామంత, సేనానులచేత గూడ బహుముఖములుగా కళాసేవను చేయించెను. ఆతనికాలమునందే ఏకశిలానగరము, రామప్ప, పిల్లల మఱ్ఱి, కొండిపర్తి మొదలగు స్థలములలో సుందరమైన

246