ఖమ్మముజిల్లా
సంగ్రహ ఆంధ్ర
భాషలు : ఇచ్చటి ముఖ్యమైన భాష తెలుగు. తెలుగుభాష మాటాడువారే అత్యధిక సంఖ్యాకులుగా నున్నారు. వరంగల్ జిల్లా లెక్కలలో వివరించిన 30,711 మంది కోయజాతివారు ఈ జిల్లా నివాసులే.
విద్య : ఈ జిల్లా విద్యావిషయములో పురోగామిగా నున్నది. విద్యాబోధక సంస్థలు 689 కలవు. వివరము లిట్లున్నవి :
1. ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజి | 1 |
2. ఉన్నత పాఠశాలలు | 25 |
3. మాధ్యమిక పాఠశాలలు | 44 |
4. ప్రాథమిక పాఠశాలలు | 573 |
5. బేసిక్ పాఠశాలలు | 44 |
6. బేసిక్ ట్రెయినింగు పాఠశాలలు | 2 |
మొత్తము | 689 |
వైద్యశాలలు : ఈ జిల్లాప్రధానస్థానమగు ఖమ్మముపురములో సర్కారువారి గొప్ప ఆసుపత్రి కలదు. ఇచ్చట మండల ఆరోగ్యశాఖ కలదు. సంచార వైద్య సహాయక నిర్మాణము కలదు. తగు పరికరములతో, ఔషధాదులతో ఒక డాక్టరు గ్రామములలోని జనులకు వైద్యసౌకర్యము కూర్చుచుండును. జిల్లాయంతటను 7 జనరల్ ఆసుపత్రులు 4 వైద్యశాలలు కలవు.
పట్టణములు : ఈ జిల్లాలో 6 పట్టణములు కలవు. వాటి వివరములు :
జన సంఖ్య | |
1. కొత్తగూడెము | 50,195 |
2. ఖమ్మంమెట్టు | 28,251 |
3. ఎల్లందు | 13,929 |
4. కల్లూరు | 5,094 |
5. మధిర | 4,835 |
6. బూర్గుంపహడు | 3,758 |
పుణ్యక్షేత్రములు : కూడలి, లక్ష్మీపురం, నేలకొండపల్లి, నాగులవంచ, ఖమ్మముమెట్టు (లక్ష్మీనరసింహస్వామి), జమలాపురం గొప్పగా జాతరలు జరుగు పుణ్య క్షేత్రములు. ఈ జిల్లాలోనే గాక, ఆంధ్రదేశములోనే గాక, భారతభూమిలో ప్రఖ్యాతి వహించిన మహా పవిత్ర క్షేత్రము భద్రాచలము. ఇది గోదావరీతీరమున నున్నది. భద్రాచలములోని శ్రీ సీతారామచంద్రుల దర్శనార్థము భారతదేశపు పలుప్రాంతములనుండి భక్తులు విచ్చేయుదురు.
చిత్రము - 56
పటము - 2
శ్రీ భ్రమరాంబా సహిత శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయము
(కోటగోడ దగ్గరనున్న పురాతన దేవాలయము)
204