పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/247

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖమ్మముజిల్లా

సంగ్రహ ఆంధ్ర

భాషలు : ఇచ్చటి ముఖ్యమైన భాష తెలుగు. తెలుగుభాష మాటాడువారే అత్యధిక సంఖ్యాకులుగా నున్నారు. వరంగల్ జిల్లా లెక్కలలో వివరించిన 30,711 మంది కోయజాతివారు ఈ జిల్లా నివాసులే.

విద్య : ఈ జిల్లా విద్యావిషయములో పురోగామిగా నున్నది. విద్యాబోధక సంస్థలు 689 కలవు. వివరము లిట్లున్నవి :

1. ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజి 1
2. ఉన్నత పాఠశాలలు 25
3. మాధ్యమిక పాఠశాలలు 44
4. ప్రాథమిక పాఠశాలలు 573
5. బేసిక్ పాఠశాలలు 44
6. బేసిక్ ట్రెయినింగు పాఠశాలలు 2
మొత్తము 689

వైద్యశాలలు : ఈ జిల్లాప్రధానస్థానమగు ఖమ్మముపురములో సర్కారువారి గొప్ప ఆసుపత్రి కలదు. ఇచ్చట మండల ఆరోగ్యశాఖ కలదు. సంచార వైద్య సహాయక నిర్మాణము కలదు. తగు పరికరములతో, ఔషధాదులతో ఒక డాక్టరు గ్రామములలోని జనులకు వైద్యసౌకర్యము కూర్చుచుండును. జిల్లాయంతటను 7 జనరల్ ఆసుపత్రులు 4 వైద్యశాలలు కలవు.

పట్టణములు : ఈ జిల్లాలో 6 పట్టణములు కలవు. వాటి వివరములు :

జన సంఖ్య
1. కొత్తగూడెము 50,195
2. ఖమ్మంమెట్టు 28,251
3. ఎల్లందు 13,929
4. కల్లూరు 5,094
5. మధిర 4,835
6. బూర్గుంపహడు 3,758

పుణ్యక్షేత్రములు : కూడలి, లక్ష్మీపురం, నేలకొండపల్లి, నాగులవంచ, ఖమ్మముమెట్టు (లక్ష్మీనరసింహస్వామి), జమలాపురం గొప్పగా జాతరలు జరుగు పుణ్య క్షేత్రములు. ఈ జిల్లాలోనే గాక, ఆంధ్రదేశములోనే గాక, భారతభూమిలో ప్రఖ్యాతి వహించిన మహా పవిత్ర క్షేత్రము భద్రాచలము. ఇది గోదావరీతీరమున నున్నది. భద్రాచలములోని శ్రీ సీతారామచంద్రుల దర్శనార్థము భారతదేశపు పలుప్రాంతములనుండి భక్తులు విచ్చేయుదురు.

చిత్రము - 56

పటము - 2

శ్రీ భ్రమరాంబా సహిత శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయము

(కోటగోడ దగ్గరనున్న పురాతన దేవాలయము)

204