110 సాహిత్య మీమాంస
చారమై యున్నది. యువకులు వివాహభారమును తమ నెత్తుల కెత్తుకొనకుంటే ప్రణయాఖేటనాచారమునకు అవసర ముండదు. ప్రేమ క్రయవిక్రయసామగ్రి కానేరదు. అప్పుడు స్త్రీలకు లజ్జయే నిసర్గభూషణ మయి వారు జాతికీ సంఘమునకూ ఖ్యాతి తెచ్చెదరు. ఇట్టిశీలమే శకుంతలకు కల్పింప బడినది.
శకుంతల - మిరాండా
నాగరికప్రపంచముతో నెట్టిసంసర్గమూ లేక నిర్జనమగు ఋష్యాశ్రమమున శకుంతల పెరిగినట్లే, మిరాండాకూడా జనశూన్యారణ్యమున జనకునిచే పోషింపబడెను. శకుంతలహృదయమున ప్రేమోద్రేక ముదయించు ప్రాయమున దుష్యంతు డామెకంట బడెను. ఆమెకప్పు డుదయించిన ముగ్ధత్వము లజ్జనుగూర్చి ముచ్చటించితిమి. మిరాండా తండ్రినితప్ప ఇతరులనుచూడనేలేదు; కాని ఫెర్డినెండ్ ఆమెకంట బడడముతోనే ప్రౌఢనాయకివలె మాటలాడుటకు మొదలుపెట్టింది! శకుంతలను చూచిందిమొదలు రాజే భోగట్టాఅంతా కనుక్కొని వివాహప్రసంగము చేసెనుగాని ఆమె ఆసంగతి యెత్తనేలేదు.
ఇక మిరాండా వృత్తమును పరికించండి : _
- [1]మిరా - నాపై నీకు ప్రేమ ఉన్నదా ?