ఈ పుట ఆమోదించబడ్డది

గీ. నాన్నగారు సజీవులైయున్నయప్ప
డమ్మ లిమ్ముగ సేమమ్ము నరయుచుండ
గ్రోత్తగా సాగివచ్చిన కూర్మి సతులఁ
గలసి మనమున్న యాదినములు చనెను నకటు.

సంస్కృత శ్లోకము:
జీవత్సు తాతపాదేషు, నూతనే దారసంగ్రహే
మాతృభిఃపాల్యమానానాం, తే హి నో దివసాగతాః.

భవభూతి ఈసన్నివేశమున నీ చిన్న శ్లోకముచే రాము నేడ్పించి యాతని పితృప్రే మను మిగులఁ జాకచక్యముతో లోకమునకింకొకసారి వెల్లడించి కృతార్డుఁడైనాడు. ఇంతేకాక కుటుంబాధికారియైన తండ్రి కుటుంబ సంరక్షణ చేయుచుండ గరుణాలవాలయైన తల్లి సమస్తోపచారములు చేయుచుఁ గన్నబిడ్డలను గన్నులలోఁ బెట్టుకొని పెంచుకొనుచుండ గ్రోత్తగాఁ గాపురమునకు వచ్చిన భార్యలతో నిర్విచారమగు నిత్యమహానందము నొందు పడుచువారి సౌఖ్యాధిక్యమును, సర్వకాలములందలి, సర్వదేశములందలి, సర్వజాతులందలి సంసారముల కన్నింటికి సరిపోవునట్టు వర్ణించి దేవతలు తనపై బుష్పవృష్టి గురియ దనంత కవితా ప్రాగల్బ్య మీ కవి యనుష్టుపునం దగపరచినాడు. సెబాన్.

కాని మృతుఁడైన తండ్రిపటమును జూచిన విచారమైననుఁ గాలక్రమమునఁ దగ్గునని మనవిచేసియున్నాను. కొంతకాలమునకు మృతుల పటములు గూడ సంతోషదాయకముల గును. ఈ విగ్రహము మా తండ్రిగారిదని, యిది మా తల్లిగారిదని యితరులకుఁ బ్రత్యాసక్తిగా మనము చూపింతుము. అపసవ్యపుఁ జావులు మాత్ర మధికకాలము తీసికొనక తప్పదు.

పటసందర్భమున భవభూతి చేసెనని నాకుఁదోఁచినలోపము లేవో కనఁబఱచినాను. అవి యసహజములని యాతం డెఱుగఁడా యని మనము కఠినముగ మనలఁ బ్రశ్నించుకొం దము. 'ఎఱుఁగడని యెట్టు స్పష్చముగఁ జెప్పఁగలము." ఎఱిగియుండియు నేల యట్టు వ్రాసినాఁడు.

నాటకమునకు భావికథా సూచనము మహాభూషణము. ఈకవికి భావికథా సూచన యందున్న వాంఛ యింత యంతకాదు. ప్రతిస్వల్పవిషయ మందులకే ఉపయోగించినట్టు ప్రయత్నించును. ఈ కవికి రసపుష్టి కలుగఁజేయుటయం దభిమాన మసాధారణము. ఈకవి యావేశపూరితమైన హృదయము కలవాఁడనుట స్పష్టము. అట్టియావేశసందర్భములందు బ్రకృతిసూత్రములను గొంత యలక్యము చేసినను జేయఁగల స్వతంత్రుఁడు నిరంకుశుఁడు.

ఉత్తరరామచరిత్రము ప్రదర్శింపఁబడఁగ రెండుసారులు చూచితిని. రెండుసారులు కూడ మొదటి యంకమేమో చూచువారికి విసుగు గలిగించినది. తరువాతి యంకము లఖండరసప్రవర్షణ సమర్ధములైయున్నవి.

"కిమపి కిమపి మందం మందమాసత్తియోగా
దవిరలితకపోలం జల్పతోరక్రమేణ