ఈ పుట ఆమోదించబడ్డది

ముప్పదియవ ప్రకరణము

ట్లు సంయుక్త తనమనోకాంతుని చరణంబుల స్తరించుకొనుచు సేనల నతి ప్రావీణ్యముతో నడిపించుకొని గైజియాపురమున కఱిగెను. ఆమె యచటి కేగునప్పటికి నచలునిసేన విస్తారము హతమై యుండెను. రాజకులుం డత్యంత పరాక్రమున స్వయముగ యుద్ధమునకు దిగి సైనికులకుఁ బ్రోత్సాహము కలుగఁజేయుచుండెను, సంయుక్త తాను వెంటఁగొనివచ్చినసేనల నచలుని సేనలంగలిపి యతనివార లించుకధైర్యము చెడి యుంటఁగనిపెట్టి "సైనికవర్గములారా! మిమ్ముఁజూడ నిరుత్సాహులై నట్లు గాన్పించుచున్నారు. ఇదివర కెన్నడులేని పిరికితనము నేడేల పూనెదరు? మీమీ శౌర్యముల వెల్లడిపరచుకొనదగు నిట్టి సమయము మఱియొకప్పు డెప్పుడైన దొరకునా? మనమందఱ మేనాటికైన మృతి నొందవలసిన వారమేకదా?

213