ఈ పుట ఆమోదించబడ్డది
రాణీ సంయుక్త సంయుక్త
సంయుక్త సభలోని వారల నెవ్వరి లక్ష్యపెట్టక త్వరితగతినా శిలావిగ్రహముకడకేగి దానికంఠమున పుష్పహారము వైచెను. చెంతనున్నవారు కళవళమందసాగిరి. రాజకుమారులు విషణ్ణులై తమ చోటులఁబాసి లేవసాగిరి. ఎక్కడికేగునో యని చూచుచు కూర్చున్న జయచంద్రున కా వార్త తెలిసినతోడనే మధ్యందిన మార్తాండునింబోలె రోషభీషణాకారుఁడై సంయుక్తను లోపలికిఁ గొనిపొండని పరిచారికలకు దెలియబఱచి తాను రాణీసమేతుడై యంతఃపురమున కరిగెను. ఆశాభంగమగుటచేఁ దక్కిన రాజులును దమతమ నివాసముల కేగిరి,
104