ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు మూడవముట్టడి.

117

లోలోపల నుదయసింగునకే కడుగూర్చును. ఒకమారు చిత్తూరుకోటలోనున్న వనవీరుని సైనికులకు భోపనసామగ్రులు కావలసియుండినందున వేయిబండ్ల మీఁద సరకులు వచ్చుచున్న వని మంత్రి వనవీరునితోఁ జెప్పి తలుపులు పూతి౯గా దీయించెను. వేయిబండ్లును గోటలోఁ బ్రవేశించిన పిదప బండ్లలోనుండి సరకులకుమారు వేయిమంది రాజపుత్రవీరులు వడివడి దిగి కావలివాండ్ర నందఱఁ దెగటార్చిరి.

ఉదయసింగు విజయుఁ డై భేరీ భాంకరణములతో గోటలోఁ బ్రవేశించెను. వనవీరుఁడు వెనుక విక్రమజిత్తును నుదయసింగును జేసినట్లు వాని నప్పుడు రాజపుత్రప్రభువులు చేసినచో బాగుండును. కాని తామే వానిఁ జిత్తూరు సంరక్షుకునిఁగా నేర్పఱచినందున తామే వానిం జంపుట యనుచితమని కరుణించి వానిం గడతేర్పక సకుటుంబ సపరివారముగ కోటవిడిచి యావలకుం బొమ్మని వానిని విడిచిరి. వనవీరుఁడును రాజ్యభ్రష్టుడై బంధువిరోధియై నిర్భాగ్యుఁడై యసహాయుఁడై తనవస్తువులను దాను తీసికొని కోటవిడిచి దక్షిణ హిందూస్థానమునకుం బోయి యచ్చట నొక చిన్న సంస్థానమున కధిపతియై కాలము సుఖముగఁ గడపెను. ఉదయసింగు చిత్తూరు రాణా యయ్యెను. పున్న యనఁగా హిందీ భాషలో వజ్ర మని యర్ధము. ఆశబ్దమునకు నిజముగా పున్న దగినది యగుటచే నామెకీతి౯ యాచంద్రార్కము లోకమున నిలుచుఁగాక!


చిత్తూరు మూడవముట్టడి.


చిత్తూరు దేశములోని సమస్తజనులకు గన్నులు చల్లఁబడున ట్లుదయసింగు రాజ్యపాలన మారంభించెను. అతఁడు చిత్తూరునకు