ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణా సంగుడు.

89


ము సేయఁదలంచి గుండె రాయిఁ జేసికొని తన సేనతో బయలు దేరి వచ్చి శత్రుపక్షమునఁ జేరెను.

పగతుర, సేన వచ్చి యాకస్మికముగ వెనుక దాఁకుట చేతను స్వజనము 'మోసపుచ్చుట చేతను, తురకలు పట్టిన పట్టు విడువకపోవుట చేతను రాజపుత్ర సేన యెట్టకేలకు కట్టుచెడి తిరిగి పారిపోవలసివచ్చెను. మహమ్మదీయులు రాజపుత్ర సేన నోక మూలకుం దరిమి ఫిరంగులు బారుచేసి కొట్టఁజొచ్చిరి. అందుచే దాదాఁపుగా నందఱు హతులయిరి. కొంద ఱెట్టెటో దెబ్బలు తప్పించుకొని పాఱి పోఁగలిగిరి. వారిలో రాణా యొకఁడు ఆ రణమునఁ దగిలినగాయముల చేత రాణా కుంటి యగుటచే రణరంగమున నుండి పారిపోవుట కతని కిష్టము లేకున్నను సేవకులే యతనిని మోసికోనిపోయి యపాయముననుండి దాఁటించిరి. కాని యనేకులు యుద్ధభూమి నుండి విడువక ప్రాణములు విడిచిరి. అట్టి వారిలో చందారతువంశస్థుఁ డగురాజపుత్ర వీరు డోఁకడు మహశూరు లగు మూడు వందల మంది చుట్టములతో మృతినొంది రాణా వారికి తొల్లి రాజ్యము సేయునప్పు డాలోచనలు చెప్పుటలో నెట్లు ప్రథమగణ్యుఁ డయ్యెనో వారినిమిత్తము ప్రాణములు విడుచుటలో నట్లే ప్రథమగణ్యుఁ డయ్యెను. అతనికి సాయమై మార్వారు రాజకుమారుఁడు మఱి యిరువది మంది రాజకుమారులతో గూడి నేలం బడియుండె. ఈ యుద్ధము జరిగిన దాపునకు సమీపమునందే బేబరు రణనిహతు లయిన రాజపుత్ర శూరులపుట్టెలతో నొక జయస్థంభమును గట్టించెను.

ఇట్లు సంపూర్ణ పరాజయము నొంది కూరుచున్న చోటనుండి కదల లేని కుంటియయ్యు రాణు సంగుఁడు శౌర్య గాంభీర్యముల యందు సింహమువలె 'మెలఁగ జొచ్చెను. తలుపు వేసికొని చిత్తూరుకోటలో దాఁగికోనుట కతనికిష్టము లేక కోటతలుపు లెప్పుడు తెఱచి యుండ వలసిన దని యానతిచ్చి తానెప్పటికైన శత్రువులను జయించి జయ