90
ప్రసార ప్రముఖులు.
దర్శకుల దృష్టిలో పడ్డారు. వందలాది చలన చిత్రాలలో పనిచేశారు. చాలా సినిమాలలో డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు. స్వయంగా చిత్రాలు నిర్మించారు.
1971 లో పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు పక్షాన నిలబడి ఒంగోలు లోక్సభ స్థానానికి ఎంపికయ్యారు. లోక్సభలో సాంస్కృతిక విషయాలను ప్రస్తావించి సభ్యుల దృష్టిని ఆకర్షించారు.
స్వయంగా రచయిత అయిన జగ్గయ్య రవీంద్ర గీతావళిని తెలుగులోకి అనువదించి ప్రచురించారు. చక్కటి పద్యరచన చేయగల సమర్ధులు జగ్గయ్య. ఆత్రేయగారి మీద అభిమానంతో ' మనస్విని ' ప్రచురణలు వెలువరించారు. జగ్గయ్య మదరాసులో స్థిరపడ్డారు.
విదేశీ తెలుగు కార్యక్రమాలు
రేడియో మాస్కో నుండి 1968 నుండి తెలుగులో అరగంట కార్యక్రమాలు ఆసియా దేశాలకు ప్రసారమయ్యేవి. కమ్యూనిస్టు రష్యా విడిపోయి ముక్కలైన తర్వాత ఈ ప్రసారాలు నిలిచిపోయాయి. ఢిల్లీ వార్తల విభాగం నుండి ఎందరో మాస్కోకి డెప్యుటేషన్మీద రెండేళ్ళపాటు వెళ్ళి అక్కడ ఒకరిద్దరు ఉద్యోగుల సహకారంతో తెలుగు కార్యక్రమాలు రూపొందించారు.
వారిలో శ్రీయుతులు తిరుమలశెట్టి శ్రీరాములు, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, భండారు శ్రీనివాసరావు (హదరాబాదు) చెప్పుకోదగినవారు. వారు ఆ దేశీయుల ప్రేమాదరాలకు పాత్రులయ్యారు.
ఆకాశవాణి విదేశీ ప్రసార విభాగం ఓవర్సీస్ ప్రసారాలలో తెలుగు ప్రసారాలను 1990 ఉగాది నుండి ప్రారంభించింది. అప్పట్లో కేంద్ర ప్రసారశాఖా మంత్రిగా పర్వతనేని ఉపేంద్ర ఉండేవారు. ఉదయం 4-30 ని. ల. ప్రాంతంలో 30 నిముషాలు ఈ ప్రసారాలు ఢిల్లీ నుండి జరిగేవి. 1995 నుండి ఈ విదేశీ ప్రసారాలు హైదరాబాదు కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. South East Asia దేశాల