ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

37

E. L. నారాయణ :

లక్ష్మీనారాయణ కృష్ణాజిల్లాలో జన్మించారు. వ్యవసాయ పట్టభద్రులై రాష్ట్రప్రభుత్వ వ్యవసాయశాఖలో డిమాన్‌స్ట్రేటర్‌గా పనిచేశారు. 1975 లో ఆకాశవాణి కడప కేంద్రంలో వ్యవసాయ విభాగంలో రిపోర్టర్‌గా చేరారు. 1980 లో ఫారమ్‌రేడియో ఆఫీసర్ అయ్యారు. 1984లో హైదరాబాద్ బదిలీ అయ్యారు. వ్యవసాయ కార్యక్రమ రూపకల్పనలో నేర్పరి. 1993లో అసిస్టెంట్ స్టేషన డైరక్టర్ గా హైదరాబాదులో పదోన్నతి పొందారు. మరో అసిస్టెంట్ డైరక్టర్ K. మల్లికార్జునశర్మ చక్కని రచయిత.

Y. రాఘవులు :

రాఘవులు చక్కటి గాత్రం గల నటుడు. పౌరాణిక పాత్రలలో నటించాడు. కొంతకాలం రాష్ట్ర మంత్రి శ్రీ టి. వి. రాఘవులు వద్ద పి. ఏ. గా పనిచేశారు. ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో చేరారు. 1983 లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో నాటక విభాగం ప్రొడ్యూసర్‌గా చేరారు. నిజామాబాదులో కొంతకాలం పని చేశారు. 1993లో కొత్తగూడెం కేంద్రానికి అసిస్టెంట్ స్టేషన డైరక్టర్‌గా పదోన్నతిపై వెళ్ళారు.

యం. జనార్దనరావు :

1945 అక్టోబరు 10న జనార్దనరావు కాళహస్తిలో జన్మించారు. పట్టభద్రులై ఆకాశవాణిలో 1968 డిసెంబరులో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. 1979లో పదోన్నతిపై ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో చేరారు. 1993లో పదోన్నతిపై అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా అక్కడే చేరారు.

శ్రీమతి ప్రయాగ వేదవతి :

ప్రయాగ నరసింహశాస్త్రిగారి కుమార్తె వేదవతి. వేదవతి 1951 మే 5న మదరాసులో జన్మించారు. ఎం. ఏ. తెలుగు, ఆంగ్లంలో పట్టభద్రులు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ప్రొడ్యూసర్‌గా చేరారు (1971లో). U. P. S. C. ద్వారా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అయి విశాఖపట్టణం; విజయవాడ కేంద్రాలలో 1980 నుండి పనిచేస్తున్నారు. 1993లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా పదోన్నతి పొందారు. వీరు 1996 నుండి నిజామాబాద్‌లో అసిస్టెంట్ డైరక్టరుగా వ్యవహరిస్తున్నారు.