ఈ పుట ఆమోదించబడ్డది

ముస్లీమ్‌  :- విశ్వహిందూపరిషత్‌, భజరంగ్‌దళ్‌ వారి వలననే మన దేశములో ముస్లీమ్‌ల ఉగ్రవాదము పెరిగిపోయినది. వారు మా ముస్లీమ్‌లకు కొద్దిగ వ్యతిరేఖత చేస్తే, మా ముస్లీమ్‌లు ఏకంగా ఎంతోమంది హిందువు లను చంపివేయుచున్నారు. ఆ రెండు సంస్థల పనులకు అమాయకులైన హిందువులు ఉగ్రవాదుల చేతులలో బలియైపోవుచున్నారు. ముఖ్యముగా చెప్పాలంటే హిందువులందరూ ఈ రెండు సంస్థలను ఏవగించుకొంటు న్నాయి. హిందూ మతనాశనానికే ఈ సంస్థలు పుట్టాయి అనుకుంటున్నారు.

క్రైస్తవుడు  :- విశ్వహిందూ పరిషత్‌ వాళ్ళు వివేకానందుని పేరును గొప్పగ చెప్పుకుంటుంటారు కదా! వివేకానందుడు ప్రభువును గురించి ఎక్కడా చెడ్డగగానీ, తక్కువ చేసిగానీ మాట్లాడలేదు. హిందూమతములో వివేకానందుని స్ఫూర్తితో ముందుకు పోవు హిందువులు, ప్రభువు మాట వింటూనే ఎందుకు మండిపడుచున్నారు. ఏసుప్రభువు మాటను చూస్తేనే ఎందుకు ఎలర్జివచ్చిన వారి మాదిరి ప్రవర్తిస్తున్నారు. బైబిలును చదువుచున్న నిన్ను ఎందుకు కొట్టారు? బైబిలును చదివిన నీ మీద అంత కోపమును ప్రదర్శించిన వారు ప్రభువును గౌరవించిన వివేకానందున్ని ఎందుకు ఏవగించుకోలేదు. ‘‘స్వామి వివేకానంద సమగ్ర సప్రామాణిక జీవితగాథ’’ పుస్తకము యొక్క రెండవభాగములో 17వ పేజీలో రెండవ పేరాయందు రెండవ లైనులో ‘‘నేను కూడా పాలస్తీనాలో క్రీస్తుతో కలిసి జీవించి ఉంటే ఆయన పాదాలను కన్నీటితో కాదు, నా హృదయరుధిరముతో కడిగి ఉండేవాన్ని’’ అని వివేకానందుడు స్వయముగా ఈ మాట అన్నపుడు వివేకానందున్ని విశ్వహిందూపరిషత్‌వారు ఎందుకు గొప్పగ చెప్పుకొంటున్నారు. వారికున్నది పరమత ద్వేషము తప్ప హిందూమతములోని