ఈ పుట అచ్చుదిద్దబడ్డది

51


అని యమరేశ్వరుని ప్రయోగము. (ఇందు మాకనుచోట బహువచనము.

(పుట 362)

క్రీ. శ. 1740లో కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణ సారసంగ్రహ మున విక్రమ సేనమునండి యీ క్రింది పద్యము సుదాహరించినాడు-

ఆ. వె. నీరసగ్నియునికి మారయ విస్మయం
బనుచు బాడబాగ్ని కదలి యప్పు
రంబు జొచ్చెనొక్కొ రత్నాకరము మణు
లనగ జెలువమమరు నాపణములు.

ఇందువలస 1740 ప్రాంతమున నీ కావ్యము ప్రచారమున నుండెను.

క్రీ. శ 1908తో కవిగారు తమ కు సూర సంభవ లఘుటిక లో విక్రమ సేనమునుండి పద్యములుదాహరించుటచేత నిది యీ శతాబ్దిలోగూడ పరిశోధకు లకు పరిచితమని తెలియవలెను,

ఏక్రమ సేనముస ప్రబంధరత్నావళిలో లేని పద్యములు- ప్రబంధమణి భూషణము నుండి.

137. మ. శరధిప్రఖ్యము వేదమూర్తులు కుభృత్సంకాశముల్ మారుతో
ధురవేగంబులు కిన్న రేగధను బుద్ధూతారు లభ్రంకష
స్ఫురణాన్నత్యము లభగేహభముల్ పుణ్య స్తముల్ తత్పురీ
పరిభావి ప్రగజాశ్యవైశ్యసుభట ప్రాకార సౌధోన్నతుల్

.

147. సీ. వీక చారవింద దీర్ఘ కలలో విహరించి నలిఁగమ్మ దావులననగి పెనఁగి
కుసుమిత నవలతా విసరంబుగడలించి యలదేనియల సోననలము కొనుచు
సహకారపాదపచ్ఛాయలకై యేగి శశికాంత వేదులను చరించి
సురత కేళీ'శ్రాంతి సొగియు ముద్దియల పై చిట్టాడు తనువుల చెమటలార్చి
చంచరీకంబురీతి పర్జన్యు భాతి
వీరహపరీతాపహరుమాడ్కి సురటిరీతి
నప్పురంబుస సకల జనానుమోద
కరణదక్షుడు దక్షిణగంధవహుఁడు,