ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

పరా స్తమగుచున్నది. ( డాక్టరు కేతవరపు రామకోటిశ్రీ. తిక్కన కావ్య శిల్పము. (పుట 8). )

తిక్కన విజయ సేనములోని-

“మదనవశీకార మంత్రదేవత దృష్టి
గోచరమూర్తి గైకొనియె నొక్కొ"

అను పద్యపాదమును నూతనకవి సూరన తన ధనాభిరామమున నిట్లనుకరించి

“మదనవశీకార మంత్రరూపములోన మెలగేడు తొలుకొరు మెఱువులనఁగ" (2–24)

దీనినిబట్టి విజయ సేనము ప్రచారములోనున్నదని చెప్పవచ్చును.

ప్రబంధమణిభూషణమున (క్రీ. శ. 17 వ శతాబ్ది)గల విజయ సేనము నందలి పద్యములు ఇవి యీ గ్రంథమున లేవు.

సీ. ఆమ్మెద ననినఁ బద్మాషుఁ గౌస్తుభమైన వెఱవక కొనియెడు వెరవుగలిగి
విలువయిచ్చెదమని వేఁడినఁ బులిజున్నుఁ గమ్మపసిండియు నమ్మగలిగి
ఏ వస్తువైన ప్రొద్దెందఱు జనుదెంచి యెంతటి కడిగిన నెదురుగలిగి
తనయింటలేని యర్థము లర్దపతియింట నైన వెదకిన లేవనుటగలిగి

తమ కులాచార చారు వర్తనము కొఱకు
నంగడుల యొప్పునకును బేహారమాట
గాని లాభంబునకు నాటగాదనంగ
వరలుదురు పురవరంబున వైశ్యవరులు,

ఏనుగులు

100 సీ. ఉన్నచో గతిమాలి యునికి యిష్టంబని గ్రుమఱనేర్చిన కౌండలనఁగ
గాలిచేఁ దూలెడు కష్టంబు వోవఁగ ఘనమైన నీలమేఘంబు లనఁగ
వినురూపమై యున్కి వెల్లదనంబని కడు నల్లనైన దిగ్గజములనఁగ
తిమిరారి యట యని ద్యమణితో మార్కొని నిలిచిన యిరుల మన్నీ లనంగ