43
మున
అని ప్లుతయతికి నుదాహరణముగా నీయబడినది. దీనినే కస్తూరిరంగకవి
ఆనందరంగరాట్ఛందస్సున గ్రహించినాడు (8–189)
ఇందువలన విజయ సేనమునందలి పద్యములు 18 ను- ఒక సీసపద్యమున రెండు పాదములును లభించినవని గ్రహింపవలెను.
విజయ సేనము - తిక్కన కృతిగా పెదపాటి జగ్గన ప్రబంధ రత్నాకర యుదాహరించినాడు
పెదపాటి జగన్నాథకవి మా త్రమే యుదాహరించిన కవులు కావ్యములు
ఆంధ్ర సాహిత్యపరిషద్గ్రంథ సంధాత మాత్రమే యుదాహరించిన కవులు కావ్యములు.
ఇర్వురు సుదాహరించిన కవులు కావ్యములు అను మూడ శీర్షికలలో కవి కావ్య వివరము లీయబడినవి.
“ి తిక్కన-విజయ సేనసు 168- ! 57. ఆం. 152, 154, 155-160" అని స్పష్టముగా దెలుపబడినది. కావున క్రీ.శ. 1580 నాటికది తిక్కనకృతియే యని సంకల నగ్రంథకర్తలు నిశ్చయించినట్లు తెలియగలదు.
(పుట 188)
“తరుణుల వీరుడన్నుగవ తాకున" అను ప్రబంధ రత్నావళిలోని పద్యము-- తిక్కన నిర్వచనోత్తర రామాయణము 1-51 లో నున్నది.
తిక్కన తన గ్రంథములలో నొక కృతిలోనివి మఱియొక కృతిలో గ్రహించు సంప్రదాయము గలవాడు. నిర్వచనోత్తర రామాయణ పద్యములను భారతమున గ్రహించినాడు, అట్లే తన విజయ సేనమునందలి పద్యమును నిర్వచనోత్తర రామాయణమున గ్రహించినాడు. ఇందువలన -
“ఈ లాక్షణిక గ్రంథ ప్రామాణ్యము ననుసరించి విజయ సేనమును తిక్కనగారే వ్రాసినారనుట కవకాశము కనిపించుటలేదు" అను వాక్యము