18
ముప్పిరిగొన్న వేడుకలు మూఁగినసిగ్గ'సియాడ, బ్రీతి నీ
వప్పరమేశుఁ జూచి తనువర్ధముఁ గోంటి పొసంగ నంబికా ! "
నరసింహభట్టు, ఆమడూరి ఈతని షోడశకుమార చరిత్రముదొరకలేదు; కాని, వేఱొక కవి, వెన్నెలకంటి సూరనకుమారుఁ డన్నయామాత్యుఁడు రచియించిన షోడశ రాజచరిత్ర మొకటి దొరికినది.. [1]శ్రీ బహుజనపల్లి సీతారామా చార్యు లుగారు శబ్దరత్నాకరమున షోడశకుమార చరిత్ర మొకటియెల్లనకృతముగా నుదాహరించినారు. వారు పరికించి.. యాప్రం యెక్కడ నున్నదో !
నాగనాథుఁడు, పశుపతి :- ఈతఁడు వెన్నెలకంటి సూరనకంటెఁ బ్రాచీనుఁడే
కావలెను. శ్రీ వీరేశ లింగముపంతులుగారు వెన్నెలకంటి సూరన (విష్ణు
పురాణకర్త) కాలము క్రీ.శ. 1480-90 ప్రాంత మని యసమర్థ సాధనములతో
సిద్ధాంతపఱచినారు. కాని, తత్కృతిపతి యగు బసవయ రాఘవుఁడు2[2] క్రీ. శ.
1628. 29 ప్రాంతమున నున్న వాఁ డగుటచే నాతఁ డంతకుఁ గొంత తర్వాతి వాక
డగును.
నన్నిచోడఁడు
ఈ కవి కాలనిర్ణయాదికమును గూర్చి పెక్కురు చర్చించి యున్నారు. అన్ని చర్యల పర్యవసానము నింతే. ఈ కాలమువారని సిర్ధారించుటకుఁ దగిన సాధనములు లేవు. శ్రీచిలుకూరి వీరభద్రరావుగారాంధ్రుల చరిత్రమున నిట్లు వ్రాసినారు. క్రీ. శ. 925-40 సం, ప్రాంతమున నున్న యీ సత్యాశ్రయుని నన్నెచోడమహాకవి తన కుమారసంభపకావ్యమున నీక్రింది పద్యములోఁ బేర్కొనియున్నాఁడు.
“క. మును మార్గకవిత లోకం
బున వెలయగ దేశిక వితఁ బుట్టించి తెనుం
గు నిలిపి రంధ్రవిషయమున
జన సత్యాశ్రయునిఁ దొట్టి చాళుక్యనృపుల్."
1.
2.