ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వయ తాళానుగతిం బ్రమోదమున మత్తల్లీ మహానృత్యముల్
ప్రియ మొప్పారఁగఁ జేయు భైరవుఁడు గల్పించున్ మహైశ్వర్యముల్.[1] (ఆం) 567

సీ. గండపాళికలును గన్నులుఁ దెలుపెక్కెఁ దోరంబులయ్యెఁ బెందొడలు నడుము,
గతియును దీపనస్థితియు మాంద్యముఁ దాల్చెఁ బృథలత మించె నాభియును బిఱుఁదుఁ,
జను ముక్కులును నారుఁజాల నీలిమ నొప్పె సన్నంబులయ్యె వాచవులుఁ దనువుఁ,
గోర్కులు నూర్పులుఁ గొనలు సాగఁగఁ జొచ్చెఁ దలసూపె నిదురయు నలసతయును,
ఆ. సిగ్గు వదలెఁ బుట్టెఁ జిట్టుము లుప్పొంగె
వింతకాంతి యోకిలింత లడరె
నర్కవంశతిలకమైన కుశధ్వజు
నువిద కపుడు గర్భ మొదవుటయును. (ఆం) 568

గీ. గజ్జపరిద్రొక్కెఁజూపె భాగడవిధంబు
గీతమున కాడెఁ జేసె సంకీర్తనంబు
పాడె సూళాదిగీత ప్రబంధవితతి
భృంగి పంచాంగకంబైన పేరణమున. (ఆం) 569

సీ. గొజ్జంగివిరులపైఁ గుప్పించుఁ కుప్పించి కన్నె గేదఁగులపై గంతు గొనును,
వకుళగుచ్ఛములపై వర్తించు వర్తించి పున్నాగతతులపైఁ బూన్కి నెఱపు,
గురువెందపొదలపైఁ గ్రుమ్మఱుఁ గ్రుమ్మఱి విరవాదిలతలపై విశ్రమించు,
మల్లికావలులపై మసలాడు మసలాడి సురపొన్నతరులపైఁ బొరలు వెట్టు,
గీ. ననుదినము నిట్లు పుష్పవాసనలఁ దేలి
యంగజాభంగరతులందు ననఁగి పెనఁగి
యలసిపడియున్న జనముల యలఁత మాన్పు
మలఁగి యప్పురిఁ బ్రాభాతమారుతంబు. (ఆం) 570

మ. గ్రహయుక్తంబయి ఫేనతారకలచేఁ గన్పట్టి మందాకినీ
సహితంబై ధ్రువలక్ష్మిచే నమరుచున్ సర్వాతిరిక్తంబునై

  1. చూ. కాశీఖండము 5.83