పుట:Peddapurasamstanacheritram (1915).pdf/83

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కనతి దూరమున ఉన్న యొక పల్లె కరిగి పెండ్యాల వారను పేరు గల ఒక భూసురాంగనను తనకేదైనా తినడానికి పెట్టమని అడిగెను ఆమె తాము వండుకున్న అంబలి తప్ప మా ఇంట ఏమీ లేదు అని కాబట్టి ఆ అంబలి కొంచెము పోసెదనని జెప్పెను. రాజు గారు కూడా అందుకు అంగీకరించి ఆ అంబలి ని తీసుకుని త్రాగి, ఆ తరువాత ఆయన్ పెద్దాపురం చేరి ఆ పుణ్యవంతురాలయిన మహిళా మూర్తికి కబురు పంపించి ఆమెకు ఒక గ్రామమును అగ్రహారము గా ఇచ్చెను ఆ ఆగ్రహారానికె "అంబటి పూడి అగ్రహారం అని ఇప్పటికీ పేరు కలదు.

ఈ మహారాజొకనాడు మంత్రి దండనాదాగ్రణులతోనూ, అస్థాన కవివరేణ్యులతోనూ సామంత ప్రభువులతోను కొలువుదీర్చియుండ ద్వారపాలకుడు వచ్చి "మహాప్రభో ! ఏలినవారి దర్శనమునకు మాగాపు శరభకవిగారను ఒక బ్రాహ్మణుడువచ్చి తాను వచ్చితినని దేవరవారితోనే మనవి చేయమన్నారు. ఏమిశెలవని విన్నవించెనట. అందులకు రాజును ఆస్థానకవీశ్వరులలో ఒకరిని పంపి, సగౌరవంగా ఆయనను తీసుకొని రమ్మనిరట ఈకవి గారు వెళ్లి ద్వారము దగ్గిరున్న శరభకవి గారి వేషమును చూసి ఆయన అవునా కాదాయని సందేహించి చివరకు ఆయనే అని తెలుసుకుని రాజాజ్న అయినదని విన్నవింప ఆకవివతంసుడు లోనికి వచ్చెరట మహారాజ దర్శనమునకు వచ్చిన ఈ కవిగా రొక అంగవస్త్రమును కట్టుకుని చేతనొక చెంబు భుజము మీద ఒక గామంచా, చంకనొక తాటియాకు పుస్తకములకట్ట మాత్రము కలిగి యుండి, బీద బ్రాహ్మణ వేషముతో నుండిరట మహారాజు ఆయనను చూసి "ఇతడా శరభకవి ? అన్నారట . అమాట రాజు గారి నోటినుండి వచ్చీరాక మునుపే "ఇతడా" అని తక్కువగౌరవము తెలిపే శబ్ధం తో సంబొదించిరనే స్వాభిమానమున, మహారాజు దయ సంపాదించవచ్చితిని కదా అను అవేశంతో ఈ క్రింది పద్యము చదివెనట

 ఇతడా రంగదభంగ సంగర చమూహేతిచ్ఛటాపాలకో
ద్ధ్తకీలాశలభాయమానరిపురాడ్ధారాశ్రు ధారానవీ
న తరంగిణ్యబలాఅమాగమసమా నందత్పయోధిస్తుతా
యతశౌర్యోజ్వలుడైన వత్సవయ తిమ్మక్షావరుం డీతడా