పుట:Parama yaugi vilaasamu (1928).pdf/546

ఈ పుట ఆమోదించబడ్డది

[34]

సప్తమాశ్వాసము.

529


నాతల డాఁచి హేమాకృతిఁ గొనుచు
నాతలఁ గడచి తా నరుగు నత్తఱిని
శ్రీరంగనాథుఁ డాశ్రితవత్సలుండు
కూరిమితోఁ దనకొఱకుఁ గా వచ్చి
భక్తుఁ డీకైవడిఁ బ్రాణంబు లొసఁగు
భక్తికి నాశ్చర్యపడి సంతసించి
కంటిరే నాభక్తు ఘనతరభక్తి
వింటిరే యెందైన వివరించి మున్ను
అని నిత్యవరులతో నందంద బొగడి
వినతాతనూభవు వీక్షించి పలికె
నాకొఱ కిపుడు ప్రాణము లిచ్చినట్టి
నా కేశనుతుని వైష్ణవశిరోమణిని
బొందితో మస్తంబుఁ బొందుగా మగుడ
బొందించి నీముఖాంబుజసుధాధార
నెనయించి ప్రాణంబు లెసఁగింపతోడి
కొనిరమ్ము వేగ నగ్గురుభక్తినిరతు
ననఁ జని విహగేంద్రుఁ డరియముమఱఁది
తనువున మస్త మత్తఱిఁ బొందుపఱచి
తనమహత్త్వము మహీస్థలిఁ గానుపింప
ఘనతరామృతమూర్తి గాఁగ నెంతయును