పుట:Parama yaugi vilaasamu (1928).pdf/247

ఈ పుట ఆమోదించబడ్డది

232

పరమయోగివిలాసము.


వినిన వ్రాసినఁ జదివిన నుతిసేయ
నెనలేనిసంపద నెనసియుండుదురు
కావేరిదక్షిణాంగణసీమ నిచుళ
నా విలసిలు నొక్కనగరరత్నంబు
అందలిమణిమయహర్మ్యమయూఖ
బృందముల్ నిచ్చలు బీఱెండ గాయఁ
జదలేట మెలఁగెడు చక్రదంపతులు
పొదలెడువేడ్క నెప్పుడుఁ బాయకుండు
నిరుపమగురుకళా నిధులును భోగి
వరకవికేతు భాస్వద్బుధముఖులు
గలిగి యయ్యమరలోకము చెలువెల్ల
గిలిమి యాపురము మిక్కిలి నొప్పుచుండు
జనవినుతుఁడు రాయచౌహత్తమల్లుఁ
డననొప్పురాజేంద్రుఁ డాపురం బేలు[1]
నారాజదేవేంద్రుఁ డట నొక్కనాఁడు
శ్రీరంగధాముని సేవించి మగుడి
తనపురంబునకు నెంతయు సంభ్రమమునఁ
జనుచుండి వేఱొక్కజాడగా నరిగి
కలువల మించు చెంగలువల మెలఁగు
నలుల రాయంచతొయ్వలులఁ గొక్కెరల



  1. గగనంబు కలశాబ్దిఁ గనుపట్టు విష్ణు
    పగిదిఁ జూపట్టె నెప్పాటఁ జింతింప—ప్రత్యంతరము.