పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/108

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విష్ణువర్ధనమహారాజు కథ

105


వర్ధనమహారాజు చరిత్రంబు నాకర్ణింపుమని యర్జునున కీ క్రిందివిధంబునఁ జెప్పదొడంగెను.

విష్ణువర్ధన మహా రాజు కథ.

ఒకానొక కాలంబునఁ దొల్లి——యుజ్జయినీ నగరంబును ధర్మపాలుం డను రాజు ధర్మపాలుండై పరిపాలించుచు, బహుకాలంబునకు సావిత్రీ వరప్రసాదంబున, సావిత్రి యను కన్యాలలామముం గాంచెను. ఆ కన్యక సమస్త విద్యావిశారద యయ్యును, వివాహంబునొల్లక, యోగినీ వృత్తి దినంబులు గడుపఁ దలఁచియుండ, అందులకు తలిదండ్రులు మిగులఁ జింతించి, యొకనాడు, వీణావతియను నొక వేశ్యను సావిత్రి కడ కంపి శృంగార రసబంధురంబగు గానముం బాడి తచ్చిత్తవృత్తిని మరల్పుమని, నియోగించిరి. వీణావతియుఁ దన చమత్కృతియంతయుఁ దేటపడ శృంగార గీతములం బాడుటయు——సావిత్రి బిట్టలుక రెట్టింప నావీణావతింబరిభవించి దానివీణను తునియలుగా దొక్కి వేసెను. అమూల్యం బును, తనకు జీవన కారణంబును నగు వీణను సావిత్రి భగ్నముచేయుటకా వీణావతి, పెద్దపెట్టున శోకించుచు రాజుతోఁ జెప్పుకొనెను. రాజు దాని నోదార్చి, యావీణకగు మూల్యంబు లిచ్చినను, అట్టివీణ తనకు లభింపదని యావెలకాంత సంతృప్తి నందదయ్యెను. అనంతరము సావిత్రి తానొనరించిన పనికి బశ్చాత్తాపముఁ జెంది——వీణావతం బిలిపించి, క్షమింపఁబ్రార్థించి, తన కంఠమునందలి వెల నిర్ణయింప నసాధ్యమగు నొక రత్నహారమును రహస్యముగా బహుమానమిచ్చి తనరాజ్యమును వదలి యెందేనిం బొమ్మనియెను. అంత నావీణావతి క్రమంబున ననేక దేశంబులు సంచరించుచు నెందైనఁ దన వీణవంటి వీణ లభించునేమో యని విమర్శించుచునే యుండెను. కళింగ దేశాధీశ్వరుని కుమారుఁడగు విష్ణువర్ధనుండనువాఁడు మహా సౌందర్యశాలియు, రసికుఁడును, గాన