పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/26

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

ధర్మ స్వాతంత్ర్య సముద్దరణమున ఏకదీక్షగ పనిచేసిన దేశీయమహాసభగాని, 1919 సం|న బయలుదేరిన భారతీయ ప్రజాప్రతినిధుల రాయబారములవలన గాని లేశమయిన చలింపని బ్రిటీషు సామ్రాజ్యమును చంపారన్, కైరాలలోను, 1919 సO11న పంజాబు హత్యల సందర్భమునను మీరు ప్రయోగించిన సత్యాగ్రహాస్త్ర శక్తి పునాదులతో కదలించినది. నేటి మీ సహాయనిరాకరణ దీక్షతో, మీ సత్య బలప్రతిష్టతో, మీ ఆత్మశక్తితో సామ్రాజ్యము దుర్బలావస్థ చెందినది. హిందూ మహ్మదీయ సమ్మేళనమునకు మీరు సూత్రధారులై భరతఖండమును అఖండ శక్తివంతముగ చేసితిరి, మీరడిగిన గడువులోపున భారతమునకు తప్పక స్వరాజ్యసిద్ధి కాగలదని మా విశ్వాసము.

స్వదేశము కొఱకాత్మరక్తము తర్పణము వీడిననాటి రూన్సీ లక్ష్మీభాయి, భర్తృశార్య ప్రతాపముల నుద్రిక్తపరచిన ఖడ్డ తిక్కన గారి నర్గాంగలక్ష్మియు, దక్షిణాఫ్రికా ప్రభుత్వముతో పొసగిన ధర్మసమరమున మీ కష్టనష్టములయందును, మీ విజయమునందును, తోడునీడవలెనుండు జనని కసూరి బాయియ, వంగరాష్ట్రమున శారీరక వ్యాయామ మందిరముల వ్యాప్తిని పెంచి, అచ్చట పురుషనామము సార్ధక పరచిన సరళాదేవి చౌదరాణియు, కన్న పుత్రులను, మతవిశ్వాసమునకు, మాతృదేశ సేవకును అప్పగించిన అలీ సోదరుల తల్లి అబాదీ భానో సాహిబాగారును, మాస్త్రీమండలి నుండి ప్రాదుర్భవించి ఆత్మీయ సర్వస్వ సమర్పణమొనర్చి, దేశహితమునకు తోడ్పడునట్లు ఆశీర్వదింపడు. మీ త్రికరణ శుద్ధి, మీ ఆత్మసాక్షాత్కారము, మీ ధార్మికదీక్ష మీ దృఢ సంకల్పము మీ స్వరాజ్యసంపాదన ఆకాంక్ష భరతవర్షమునకు స్వరాజ్యము ప్రసాదింపగలదని ప్రతిభారత వ్యక్తి యొక్క అంతరాత్మ 'తధాస్త శబ్దము చేయుచున్నది. మా ఏలూరు స్త్రీ సమాజము కొరకు నిర్మితము కానున్న మందిరమునకు ఎట్లో రెండు వేల రూపాయలు భిక్షతో నార్జించగలిగితిమి. ఇది నిశ్చయముగ భగవత్మారుణ్యమే. తన్మందిరమునకు మీ అమృత హస్తములతో శంకుస్థాపన గావించి పునీత మొనర్పుడు. మా సమాజమును ధన్యముగా వింపుడు. చిరస్థాయిగ నుండు నటుల దీవింపడు.

మీ దంపతులకు, మీ కుటుంబమునకు దీర్షాయురారోగ్యములును, మీ దేశహితైక సేవాపరత్వమునకు ఆత్మబలమును పరమేశ్వరుడు ప్రసాదించుగాక అని ప్రార్జింతుము".

గాంధీజీ ఆంధ్రదేశ పర్యటన పూర్తి అయిన పిదప 1921 ఏప్రియల్ రెండవ వారపు "యంగ్ ఇండియా' పత్రికలో ఈ విధంగా ఆంధ్రులను ప్రశంసించారు. “ఆంధ్రదేశము