ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 20

మేము కాశ్మీరు వెళ్ళలేదు.

“నాన్నగారూ, వేసవి సెలవుల్లో హిమాలయాల దిగువ కొండలకు నాతోబాటు రమ్మని, గురువుగారినీ మరో నలుగురు స్నేహితుల్నీ పిలుద్దామనుకుంటున్నాను. కాశ్మీరుకు ఆరు ట్రెయిను పాస్‌లూ, మా ప్రయాణం ఖర్చులకు సరిపడే డబ్బూ ఇస్తారా?”

నే ననుకున్నట్టుగానే, నాన్నగారు మనసారా నవ్వారు. “నువ్వీ కాకమ్మకథ చెప్పడం ఇది మూడోసారి. కిందటి వేసంగుల్లోనూ అంతకు ముందు వేసంగుల్లోనూ, ఇలాగే అడగలేదూ నువ్వు? చివరి క్షణంలో శ్రీయుక్తేశ్వర్‌గారు రామంటారు.”

“నిజమే నాన్నగారూ, కాశ్మీరు విషయంలో మా గురువుగారు ఖచ్చితంగా మాట ఎందుకివ్వడంలేదో నాకు అర్థంకాకుండా ఉంది.[1] కాని, నే నప్పుడే మీ దగ్గర పాస్‌లు తీసేసుకున్నానని చెబితే, ప్రయాణానికి ఆయన ఒప్పుకుంటారని ఎందుకో అనిపిస్తోంది నాకు.”

అప్పటికయితే నాన్న గారికి నమ్మకం కలగలేదు. కాని ఆ మర్నాడు

  1. అంతకుముందు రెండు వేసంగుల్లోనూ కాశ్మీరు రావడానికి ఇష్టంలేక పోవడానికి కారణం గురుదేవులు చెప్పకపోయినప్పటికీ, అక్కడ తాము జబ్బు పడ్డానికి సమయం ఇంకా ఆసన్నం కాలేదన్న సంగతి ముందుగా ఆయనకు తెలిసి ఉండడమే కావచ్చు.